News June 20, 2024
రూ.30 లక్షలకు NEET క్వశ్చన్ పేపర్ అమ్మేశా: అమిత్

NEET పేపర్ లీక్ సూత్రధారి అమిత్ ఆనంద్ పరీక్షకు ఒక రోజు ముందే ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినట్లు అంగీకరించాడు. రూ.30 లక్షలు తీసుకొని ప్రశ్నాపత్రంతో పాటు సమాధానాలను అభ్యర్థులకు ఇచ్చినట్లు పోలీసుల అంగీకార పత్రంలో వెల్లడించాడు. దానాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో JE సికందర్తో కలిసి నలుగురికి ప్రశ్నాపత్రం ఇచ్చాడట. అతని ఫ్లాట్లో జవాబు పత్రం కాలిపోయిన అవశేషాలను పోలీసులు కనుగొన్నారు.
Similar News
News March 4, 2026
ఇరాన్ మరో 10 రోజులు యుద్ధం చేస్తే USకు దెబ్బే!

యుద్ధంలో ఖమేనీని తొలిరోజే అంతం చేసిన అమెరికాకు ఇరాన్ కొరకరాని కొయ్యగా మారింది. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ లొంగిపోకుండా దాడులు తీవ్రతరం చేస్తోంది. ఈ యుద్ధం 4 వారాల్లో పూర్తవుతుందని ట్రంప్ చెబుతున్నా అది మరింత కాలం సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో 10 రోజులు దాడులు కొనసాగితే అమెరికా Tomahawk మిస్సైళ్లతో పాటు SM-3 interceptors లాంటి కీలక ఆయుధాల స్టాక్స్ తగ్గిపోయే అవకాశం ఉన్నట్లు CNN పేర్కొంది.
News March 4, 2026
శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌకపై దాడి.. 100 మంది గల్లంతు!

శ్రీలంకలో ఇరాన్ యుద్ధ నౌకపై దాడి జరిగింది. సబ్మెరైన్తో అటాక్ చేయడంతో IRIS Dena షిప్లోని 101 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. మరో 78 మంది గాయపడ్డారని సమాచారం. షిప్ నుంచి సాయం కోసం కాల్ వచ్చిందని, నేవీ, ఎయిర్ ఫోర్స్ను పంపామని శ్రీలంక తెలిపింది. గాలే తీరంలో షిప్ మునిగిపోయిందని, తీవ్రంగా గాయపడిన 32 మందిని ఆస్పత్రిలో చేర్చినట్లు లంక మంత్రి విజిత హెరాత్ తెలిపారు. దాడి ఎవరు చేశారనేది తెలియాల్సి ఉంది.
News March 4, 2026
BRIC-THSTIలో ఉద్యోగాలు

<


