News February 7, 2025
నీట్- UG పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
నీట్- యూజీ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి మార్చి 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటించింది. మే 4న పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీకి NTA ఈ పరీక్ష నిర్వహించనుంది.
Similar News
News February 8, 2025
130 కి.మీ వేగంవెళ్లేలా రైల్వేట్రాక్ అప్గ్రేడ్
విజయవాడ రైల్వేడివిజన్ పరిధిలోని ట్రాక్ను గంటకు130 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ఆధునీకీకరించనున్నారు. మెుత్తంగా 1,287 KM మేర ట్రాక్ అప్గ్రేడ్ చేయదలచగా ఇప్పటివరకూ 58శాతం మేర పనులు పూర్తయినట్లు డివిజన్ ఇంజినీర్ వరుణ్బాబు తెలిపారు. వీటితో పాటు మౌలిక సదుపాయాలను ఆధునీకీకరించనున్నారు. నిడవదొలు -భీమవరం, నరసాపురం-గుడివాడ-మచిలీపట్నం, సామర్లకోట మార్గాల్లో ట్రాక్ అప్గ్రేడ్ పూర్తయిందని తెలిపారు.
News February 8, 2025
పడుకునే ముందు ఇవి తాగుతున్నారా?
రోజూ పడుకునే ముందు కొన్ని పానీయాలు తీసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి హాయిగా నిద్రపట్టేందుకు సహకరిస్తాయని అంటున్నారు. లావెండర్ టీ తాగితే ఒత్తిడి తగ్గి మంచి నిద్ర కలుగుతుంది. చమోమిలే టీ తాగడం వల్ల మానసిక ఆరోగ్యం కలిగి ప్రశాంతంగా నిద్ర వస్తుంది. పిప్పరమెంట్ టీ కూడా మంచి నిద్రకు సహాయపడుతుంది. వేడి పాలలో తేనె కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే నాడీ వ్యవస్థ రిలాక్స్గా మారుతుంది.
News February 8, 2025
కుంభమేళాలో సన్యాసినిగా మారిన మరో నటి
మరో బాలీవుడ్ నటి సన్యాసినిగా మారారు. నటి ఇషికా తనేజా కుంభమేళాలో సన్యాసం స్వీకరించారు. ఇకపై తాను సినిమాల్లో నటించనని పుణ్యస్నానం ఆచరించి ప్రతిజ్ఞ చేశారు. కాగా ఇషికా 2018లో మిస్ వరల్డ్ టూరిజం టైటిల్ గెలుచుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2016లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు.