News February 7, 2025
నీట్- UG పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

నీట్- యూజీ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి మార్చి 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటించింది. మే 4న పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీకి NTA ఈ పరీక్ష నిర్వహించనుంది.
Similar News
News December 5, 2025
మా ఇంధనం US కొనొచ్చు.. ఇండియా కొనకూడదా?: పుతిన్

ఇంధన కొనుగోళ్ల విషయంలో US అధ్యక్షుడు ట్రంప్ తీరును రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఎండగట్టారు. ‘అమెరికా తమ అణు విద్యుత్ ప్లాంట్ల కోసం మా వద్ద యురేనియం కొనుగోలు చేస్తూనే ఉంది. మా నుంచి ఇంధనం కొనే హక్కు ఆ దేశానికి ఉన్నప్పుడు భారత్కు అలాంటి హక్కు లేకుండా ఎందుకు చేయాలి?’ అని India Today ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. ఇండియాతో ఇంధన భాగస్వామ్యం స్థిరంగా ఉందని, పాశ్చాత్య ఆంక్షలతో ప్రభావితం కాలేదని స్పష్టం చేశారు.
News December 5, 2025
టిఫా స్కాన్లో ఏం చెక్ చేస్తారంటే?

టిఫా అంటే.. టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫ్యూటల్ ఎనామిలీస్. నిపుణులైన రేడియాలజిస్టులు ఈ స్కాన్ చేస్తారు. గర్భంలోని శిశువు తల నుంచి కాలిబొటన వేలు వరకు ప్రతి అవయవాన్ని స్కాన్ చేస్తారు. శిశువు, ప్లాసెంటా పొజిషన్, ఉమ్మనీరు స్థితి గుర్తిస్తారు. అలాగే తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని బట్టి ప్రసవం ఎలా చెయ్యాలి అనేది కూడా ఈ స్కాన్ ద్వారా నిర్ణయిస్తారు. కాబట్టి ఈ స్కాన్ కచ్చితంగా చేయించుకోవాలంటున్నారు నిపుణులు.
News December 5, 2025
ఇంట్లో పూజ ఎవరు చేయాలి?

ప్రతి ఇంట్లో దాదాపు మహిళలే పూజలు చేస్తుంటారు. కానీ సంకల్ప శ్లోకాలు “ధర్మపత్ని సమేతస్య” అని చెబుతాయి. అంటే భార్య సమేతంగా భర్తే పూజలో ప్రధానం అని అర్థం. భర్త క్షేమం కోసం భార్య చేసే పూజలు మినహా నిత్య పూజలు, ఇతర వ్రతాలను ఇద్దరు కలిసి చేస్తేనే అత్యుత్తమ ఫలితం ఉంటుందంటున్నారు పండితులు. దీపం వెలిగించడం, సంకల్పం చేయడం, ప్రధాన పూజాచర్యలు నిర్వహించాల్సిన బాధ్యత భర్తదే అని చెబుతున్నారు.


