News July 11, 2024

నీట్ యూజీ పేపర్ లీక్ వీడియో ఫేక్: NTA

image

మే 4నే నీట్ UG పేపర్ లీక్ అయినట్లు టెలిగ్రామ్‌లో సర్క్యూలేట్ అయిన వీడియో ఫేక్ అని NTA సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తెలియజేసింది. పేపర్ పరీక్షకు ముందే లీక్ అయిందని నమ్మించడానికి తేదీలను, సమయాన్ని ఎడిట్ చేశారని తెలిపింది. మరోవైపు పట్నాలో కమాండ్ సెంటర్ నుంచి పేపర్ లీకైనట్లు CC ఫుటేజ్‌లో ఎలాంటి ఆధారాలు లేవంది. పెట్టెల్లో పేపర్లు సేఫ్‌గానే ఉన్నాయని, తాళం పగలగొట్టిన దాఖలాలు లేవని తెలిపింది.

Similar News

News January 22, 2026

పడుకునే ముందు నీళ్లు తాగడం మంచిదేనా?

image

పడుకునే ముందు నీళ్లు తాగడం వల్ల ప్రయోజనాలతో పాటు ఇబ్బందులూ ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ‘శరీర ఉష్ణోగ్రత నియంత్రణతో పాటు రక్త ప్రసరణ మెరుగుపడి హాయిగా నిద్ర పడుతుంది. శరీరంలోని వ్యర్థాల తొలగింపునకు సహాయపడుతుంది. అయితే ఎక్కువగా తాగితే మాటిమాటికీ మూత్ర విసర్జనకు లేవాల్సి రావడం వల్ల నిద్రకు భంగం కలగవచ్చు. గుండె, కిడ్నీ సమస్యలున్నవారు నిద్రకు 1-2 Hr ముందే నీళ్లు తాగడం ఉత్తమం’ అని సూచిస్తున్నారు.

News January 22, 2026

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును ICC సస్పెండ్ చేయనుందా?

image

T20 WC మ్యాచులు భారత్‌లో ఆడబోమని బంగ్లా క్రికెట్ బోర్డ్ చెప్పడాన్ని ICC సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో ఆడాల్సిందే అని చెప్పినా వినకపోవడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు భావిస్తోంది. విచారణలో ఇదే నిజమని తేలితే BCBని సస్పెండ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల 7న WC ప్రారంభం కానున్న నేపథ్యంలో త్వరలోనే డెసిషన్ తీసుకోనుందని అభిప్రాయపడుతున్నాయి.

News January 22, 2026

నెక్స్ట్ నోటీసులు ఇచ్చేది కేసీఆర్‌కేనా?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. BRS కీలక నేతలకు సిట్ వరుసబెట్టి నోటీసులు ఇస్తోంది. ఈ నెల 20న హరీశ్ రావును విచారించిన అధికారులు తాజాగా KTRకూ నోటీసులిచ్చారు. రేపు విచారణకు రావాలని ఆదేశించారు. కాగా నెక్స్ట్ సిట్ నుంచి నోటీసులు వచ్చేది BRS అధినేత KCRకేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.