News July 1, 2024
NEET UG: ప్రైవేటు స్కూల్ ఓనర్ అరెస్ట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719051931034-normal-WIFI.webp)
NEET UG క్వశ్చన్ పేపర్ లీక్ <<13461942>>కేసు<<>>లో మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్లోని గోధ్రాలో ఉన్న జయ్ జలరామ్ స్కూల్ ఓనర్ దీక్షిత్ పటేల్ ఒక్కో విద్యార్థి నుంచి రూ.10లక్షలు డిమాండ్ చేసి 27 మందికి పేపర్ లీక్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఆ స్కూల్లోనూ NEET UG పరీక్ష జరిగింది. కాగా ఈ కేసులో గుజరాత్ పోలీసులు చేసిన ఆరో అరెస్ట్ ఇది.
Similar News
News July 3, 2024
రేపు స్వదేశానికి భారత జట్టు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719973229088-normal-WIFI.webp)
హరికేన్ కారణంగా బార్బడోస్లోనే చిక్కుకుపోయిన భారత జట్టు మరికొన్ని గంటల్లో స్వదేశానికి బయలుదేరనుంది. ఆటగాళ్లు, సిబ్బంది కోసం BCCI ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినట్లు జాతీయ మీడియా ప్రతినిధులు వెల్లడించారు. వీరితో 20మందికిపైగా మీడియా సిబ్బంది వచ్చేందుకు BCCI సెక్రటరీ జైషా అనుమతించారని చెప్పారు. ఈ క్రమంలో మీడియా వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా రేపు ఉదయం కల్లా విమానం ఢిల్లీ చేరే అవకాశముంది.
News July 3, 2024
సరికొత్త రికార్డ్.. సెన్సెక్స్@80,000
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_52024/1716789818106-normal-WIFI.webp)
దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేశాయి. 560 పాయింట్లకుపైగా లాభపడిన సెన్సెక్స్ తొలిసారిగా 80వేల మార్క్ తాకింది. మరోవైపు నిఫ్టీ 153 పాయింట్లు పెరిగి 24,277 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో దూసుకెళ్లడం మార్కెట్లకు కలిసొచ్చింది. HDFC, యాక్సిస్, ICICI, కోటక్ బ్యాంకుల షేర్లు నిఫ్టీ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఐటీ మినహా ఇతర ప్రధాన రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
News July 3, 2024
మహేశ్ మూవీలో విలన్గా మలయాళ హీరో?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719977771506-normal-WIFI.webp)
మహేశ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘SSMB29’ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తారని సమాచారం. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సలార్ సినిమాలో వరదరాజ మన్నార్గా పృథ్వీరాజ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.