News June 13, 2024
NEET: కొందరికి గ్రేస్ మార్కులు ఎందుకు కలిపారు?
NEET-2024లో కొందరికి కలిపిన <<13431802>>గ్రేస్ మార్కు<<>>లను కేంద్రం రద్దు చేసింది. కొన్ని కేంద్రాల్లో పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైందని, ఆ కారణంగా సమయం కోల్పోయిన 1,563 మందికి గ్రేస్ మార్కులు కలిపినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇటీవల తెలిపింది. గతంలో కామన్ లా అడ్మిషన్ టెస్టు సందర్భంగా సమయం కోల్పోయిన వారి విషయంలో సుప్రీం సూచించిన ఫార్ములానే ఇప్పుడు వర్తింపజేసినట్లు పేర్కొంది.
Similar News
News October 7, 2024
ప్రముఖుల సమాధులన్నీ FTL పరిధిలోనే: ఒవైసీ
TG: హైడ్రా కూల్చివేతలపై 2013లో కాంగ్రెస్ తెచ్చిన భూచట్టం ప్రకారమే ముందుకెళ్లాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సూచించారు. బాపూఘాట్తో సహా ప్రముఖుల సమాధులన్నీ FTL పరిధిలోనే ఉన్నాయన్నారు. తెలంగాణ సచివాలయం కూడా ఆ పరిధిలోనే ఉందని చెప్పారు. పేదల ఇళ్ల కూల్చివేతపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. ముందుగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
News October 7, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: అక్టోబర్ 7, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 4:55 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:07 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:04 గంటలకు
అసర్: సాయంత్రం 4:21 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:00 గంటలకు
ఇష: రాత్రి 7.12 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 7, 2024
మయాంక్ యాదవ్ అరుదైన ఘనత
టీమ్ ఇండియా క్రికెటర్ మయాంక్ యాదవ్ ఆడిన తొలి మ్యాచ్లోనే అరుదైన ఘనత సాధించారు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో తన తొలి ఓవర్ను మెయిడెన్గా ముగించారు. దీంతో అరంగేట్ర మ్యాచ్లోనే మెయిడెన్ వేసిన మూడో భారత బౌలర్గా రికార్డులకెక్కారు. గతంలో 2006లో సౌతాఫ్రికాపై అజిత్ అగార్కర్, 2022లో ఇంగ్లండ్పై అర్ష్దీప్ సింగ్ ఈ ఫీట్ సాధించారు.