News March 16, 2024
ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు ఎమ్మెల్యే

నెల్లూరు నగర శాసనసభ్యుడు డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ను నరసారావుపేట ఎంపీ అభ్యర్థిగా వైసీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఇప్పటికే ఆయన నరసరావుపేటలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 2008లో కార్పొరేటరుగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2009లో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014, 19 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ సారి లోక్సభ ఎన్నికల బరిలో నిలవబోతున్నారు.
Similar News
News February 1, 2026
నేడే కేంద్ర బడ్జెట్.. నెల్లూరు జిల్లాకు నిధులు వచ్చేనా.?

పట్టణాల్లో మురుగు నీటి నెట్వర్క్, నీటి సరఫరా బలోపేతం కోసం కేంద్ర ‘అమృత్’ పథకం జిల్లాలో నిధుల లేమితో నత్తనడకన సాగుతోంది. నెల్లూరులో storm water drainageకు ₹82 కోట్లు అవసరం కాగా ₹19 కోట్లు కేటాయించారు. కావలిలో మురుగు నీటి శుద్ధి కేంద్రాల ప్లాంటకు రూ. 3 కోట్లు, వాటర్ సప్లై స్కీంకు ₹10 కోట్ల అవసరం. బుచ్చి వాటర్ స్కీంకు ₹71 కోట్లు అవసరం కాగా ₹25 కోట్లు కేటాయించారు. వీటికి కేంద్ర నిధులు కేటాయించేనా.?
News February 1, 2026
VSU ఒప్పందం: విద్యార్థులకు నైపుణ్య శిక్షణ

విక్రమ సింహపురి యూనివర్సిటీ, హైదరాబాద్కు చెందిన SkillDzire సంస్థతో శనివారం ఎంఓయూ కుదుర్చుకుంది. విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ, సర్టిఫికేషన్ కోర్సులు, ఇంటర్న్షిప్లు అందించడమే ఈ ఒప్పంద లక్ష్యం. విద్యార్థులు అకడమిక్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నైపుణ్యాలు పెంచుకుని ఉపాధి పొందేందుకు ఇది గొప్ప వేదిక అని విసి ఆచార్య అల్లం శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ డా. కె. సునీత తెలిపారు.
News February 1, 2026
VSU ఒప్పందం: విద్యార్థులకు నైపుణ్య శిక్షణ

విక్రమ సింహపురి యూనివర్సిటీ, హైదరాబాద్కు చెందిన SkillDzire సంస్థతో శనివారం ఎంఓయూ కుదుర్చుకుంది. విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ, సర్టిఫికేషన్ కోర్సులు, ఇంటర్న్షిప్లు అందించడమే ఈ ఒప్పంద లక్ష్యం. విద్యార్థులు అకడమిక్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నైపుణ్యాలు పెంచుకుని ఉపాధి పొందేందుకు ఇది గొప్ప వేదిక అని విసి ఆచార్య అల్లం శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ డా. కె. సునీత తెలిపారు.


