News April 27, 2024
నేపాల్ సంచలనం.. వెస్టిండీస్పై విజయం

క్రికెట్లో పసికూన నేపాల్ సంచలనం సృష్టించింది. జాన్సన్ ఛార్ల్స్, ఆండ్రే ఫ్లెచర్, రోస్టన్ ఛేజ్ వంటి ఆటగాళ్లున్న విండీస్ జట్టును ఓడించింది. వెస్టిండీస్-ఏ జట్టు ప్రస్తుతం 5 టీ20 మ్యాచుల సిరీస్ కోసం నేపాల్లో పర్యటిస్తోంది. ఈరోజు తొలి మ్యాచ్ జరగగా విండీస్ 204 పరుగులు(రోస్టన్-74 రన్స్) చేసింది. ఛేదనలో మరో 2 బంతులు మిగిలుండగానే నేపాల్ ఆ స్కోరును దాటేసింది. రోహిత్ పౌడెల్ 54 బంతుల్లో సెంచరీ చేశారు.
Similar News
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.


