News March 24, 2024
ఓటర్లకు సైబర్ నేరగాళ్ల వల.. లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ

ఎన్నికల వేళ సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. రాజకీయ పార్టీలు, ఎలక్షన్ కమిషన్ పేరిట మోసాలకు పాల్పడుతున్నారు. ఓటర్ కార్డు ఆన్లైన్లో నమోదు కాలేదని, ఎన్నికల సర్వేలో పాల్గొంటే బహుమతులని ప్రజల ఫోన్లకు లింకులు పంపిస్తున్నారు. వాటిని క్లిక్ చేయగానే బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి లింకులను క్లిక్ చేయొద్దని సైబర్ క్రైమ్ అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News February 23, 2026
ఇండియా ఫైనల్ మ్యాచ్కు జగన్కి టికెట్ కొంటా: లోకేశ్ సెటైర్

AP: T20 WCలో ఇండియా ఫైనల్కి వెళ్తుందని, ఆ మ్యాచ్కి తనతోపాటు పులివెందుల MLA జగన్కు టికెట్ కొంటానని మంత్రి లోకేశ్ సెటైర్ వేశారు. IND-PAK మ్యాచ్కు <<19184657>>తాను వెళ్లడం<<>>పై YCP విమర్శలకు అసెంబ్లీ ఆవరణలో కౌంటరిచ్చారు. తనకు దేశభక్తి ఉందని, మనవాళ్లు ఎక్కడ మ్యాచ్ ఆడినా వెళ్తానని అన్నారు. హెరిటేజ్ ప్రారంభించినప్పటి నుంచి ప్రభుత్వ నిధులు రూపాయి కూడా ఆ సంస్థకు మళ్లించలేదని స్పష్టంచేశారు.
News February 23, 2026
116 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News February 23, 2026
ఆయన వల్లే మళ్లీ నాలో మార్పు: సమంత

డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో తన వివాహ బంధం గురించి హీరోయిన్ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘గతంలో నేను విడిపోయినప్పుడు ఇంకొకరిపై ఆధారపడటం సాధ్యమవుతుందని అనుకోలేదు. అదృష్టవశాత్తూ ప్రేమ, స్నేహాన్ని అంగీకరించేంత బలహీనంగా మారిపోయా. నేనున్న రిలేషన్షిప్ వల్ల బెటర్గా మారిపోయా. రాజ్ నిడిమోరు వల్లే ఇది సాధ్యమైంది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్లో రాజ్, సమంత ఒక్కటయ్యారు.


