News June 21, 2024
డార్క్వెబ్లో రూ.5లక్షలకు నెట్ ప్రశ్నపత్రాలు!

UGC నెట్ పశ్నపత్రం లీకైనట్లు గుర్తించిన కేంద్రం పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం పరీక్ష జరగ్గా సోమవారమే క్వశ్చన్ పేపర్లు డార్క్వెబ్లో ప్రత్యక్షమయ్యాయి. ఒక్కో పేపర్ను రూ.5లక్షల నుంచి రూ.6లక్షలకు బేరానికి పెట్టారు. దీన్ని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ గుర్తించి కేంద్ర విద్యాశాఖను అలెర్ట్ చేసింది. అసలు ప్రశ్నపత్రాలతో అవి సరిపోలడంతో పరీక్షను రద్దు చేశారు.
Similar News
News November 8, 2025
వీధికుక్కల సంరక్షణపై అధికారుల తర్జన భర్జన

వీధికుక్కల కేసులో <<18231321>>SC<<>> ప్రభుత్వాలకు నిన్న ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. వీటి అమలుకు తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వనరుల లేమితో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. స్కూళ్లు, బస్, రైల్వే స్టేషన్లలోకి కుక్కలు రాకుండా ఫెన్సింగ్, NHపైకి మూగజీవాలు రాకుండా ఏర్పాట్లు ఎలా చేయాలోనని మథనపడుతున్నారు. కుక్కల్ని సంరక్షణ కేంద్రాల్లో ఉంచాలని SC ఆదేశించింది. అమలుపై అఫిడవిట్లూ వేయాలని, లేకుంటే చర్యలుంటాయని హెచ్చరించింది.
News November 8, 2025
ధ్రువ్ జురెల్ మరో సెంచరీ

సౌతాఫ్రికా-Aతో జరుగుతోన్న రెండో అన్అఫీషియల్ టెస్టులో ఇండియా-A బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుతంగా ఆడుతున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 132* రన్స్ చేసిన ఆయన, సెకండ్ ఇన్నింగ్స్లోనూ సెంచరీ బాదారు. తొలి ఇన్నింగ్స్లో IND-A 255, SA-A 221 స్కోర్ చేశాయి. రెండో ఇన్నింగ్స్లో ప్రస్తుతం భారత్ స్కోర్ 355-6గా ఉంది. జురెల్ (117*), పంత్ (48*) క్రీజులో ఉన్నారు.
News November 8, 2025
48 మంది ఎమ్మెల్యేలపై CBN సీరియస్

AP: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లు, CMRF చెక్కుల పంపిణీలో పాల్గొనడం లేదని మండిపడ్డారు. ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని పార్టీ కేంద్ర కార్యాలయం సభ్యులతో సమావేశం సందర్భంగా ఆదేశించారు. పెన్షన్ల పంపిణీలో మంత్రులు, MLAలు పాల్గొనాల్సిందే అని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే నచ్చిన కార్యకర్తలనే కాకుండా పార్టీ కోసం కష్టపడేవారిని గుర్తించాలన్నారు.


