News September 5, 2024
ఇతర ఇండస్ట్రీల వారెందుకు విరాళమివ్వట్లేదని నెటిజన్లు ఫైర్

భారీ వర్షాలకు తెలుగు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే టాలీవుడ్ నటులు తోచిన సాయం చేస్తున్నారు. హీరోయిన్స్ మాత్రం నోరు మెదపట్లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా కేరళలో వరదలొస్తే చిరు, ప్రభాస్, అల్లు అర్జున్ తదితర టాలీవుడ్ నటులు రూ.కోట్లు సాయం ఇచ్చారని, కర్ణాటక, తమిళనాడులో ఏం జరిగినా మనోళ్లు ముందుంటారని ట్వీట్స్ చేస్తున్నారు. అదే తెలుగు రాష్ట్రాలకు జరిగినప్పుడు ఎవరూ ఇవ్వట్లేదని ఫైరవుతున్నారు. మీరేమంటారు?
Similar News
News December 7, 2025
వైజాగ్ పోర్టు రికార్డు.. 249 రోజుల్లో 60MMT

AP: విశాఖ పోర్టు సరుకు రవాణాలో రికార్డు సృష్టించింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్(2025-26)లో 249 రోజుల్లోనే 60M మెట్రిక్ టన్నుల సరుకును హ్యాండిల్ చేసింది. ఈ ఘనత సాధించడానికి గతేడాది 273రోజులు, 2023-24లో 275డేస్ పట్టింది. వాణిజ్యంలో జరుగుతున్న మార్పులు, మౌలిక వసతుల సవాళ్లను అధిగమించి, ప్రత్యామ్నాయ ట్రాన్స్పోర్ట్ మార్గాలపై దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమైనట్లు పోర్టు ఛైర్మన్ అంగముత్తు పేర్కొన్నారు.
News December 7, 2025
మగవారి కంటే ఆడవారికే చలి ఎందుకు ఎక్కువంటే?

సాధారణంగా పురుషులతో పోలిస్తే ఆడవారిలో చలిని తట్టుకొనే శక్తి తక్కువ. మహిళల్లో పురుషులతో పోలిస్తే కండర ద్రవ్యరాశి తక్కువగా ఉంటుంది. దీనివల్ల మహిళల్లో వేడి తక్కువగా విడుదల అవుతుందంటున్నారు నిపుణులు. అలాగే ప్రోజెస్టెరాన్ హార్మోన్, థైరాయిడ్, మెటబాలిజం తక్కువగా ఉండటం, స్త్రీలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే సామర్థ్యం ప్రభావితమవుతుందంటున్నారు.
News December 7, 2025
DRDOలో ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నారా?

<


