News April 10, 2024

ఎన్నికల తర్వాత టారిఫ్ పెంచనున్న నెట్‌వర్క్స్?

image

టెలికాం సంస్థలు త్వరలో మొబైల్ టారిఫ్ పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిశాక జూన్-అక్టోబరు మధ్య సంస్థలు 15%-17% ధరలు పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పెంపుతో ఎక్కువగా ఎయిర్‌టెల్ లబ్ధిపొందుతుందన్నారు. ఎయిర్‌టెల్‌కు యూజర్ నుంచి వచ్చే సగటు రెవెన్యూ ప్రస్తుతం రూ.208గా ఉండగా FY27కు అది రూ.286కి పెరగనుందట. కాగా 2021 DECలో 20%, 2019లో 20-40% చొప్పున టారిఫ్ పెరిగింది.

Similar News

News December 1, 2025

ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకే రుణాలివ్వాలి: CM

image

TG: ఫ్యూచ‌ర్ సిటీ, మెట్రోరైల్ విస్త‌ర‌ణ‌, RRR, రేడియ‌ల్ రోడ్ల నిర్మాణాల‌కు తక్కువ వడ్డీకే రుణాలివ్వాలని CM రేవంత్ హడ్కో ఛైర్మన్ సంజ‌య్ కుల‌శ్రేష్ఠ‌ను కోరారు. అత్య‌ధిక వ‌డ్డీతో ఇచ్చిన లోన్లను రీక‌న్‌స్ట్ర‌క్షన్ చేయాలన్నారు. మరో 10L ఇళ్ల నిర్మాణానికి రుణాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై హ‌డ్కో ఛైర్మ‌న్ సానుకూలంగా స్పందించారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు, బుల్లెట్ ట్రైన్‌ అంశాలపైనా వారు చర్చించారు.

News December 1, 2025

‘భూధార్’ కార్డుల కోసం ‘mభూధార్’ యాప్

image

TG: ఆధార్ మాదిరిగా ప్రతి వ్యవసాయ భూమికి ప్రత్యేక ID నంబర్‌తో కూడిన ‘భూధార్’ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది. భూముల యాజమాన్య హక్కుల ఆధారంగా రైతులకు అందించనుంది. ఇందుకు సంబంధించి రెవెన్యూ శాఖ ఇప్పటికే ‘mభూధార్’ ప్రత్యేక యాప్‌ను ప్రారంభించింది. స్థానిక ఎన్నికల అనంతరం 2026 JAN నుంచి ఇవి పంపిణీ అవుతాయి. వీటితో భూ వివాదాల తగ్గుదల, సులభ లావాదేవీలు, డిజిటలైజేషన్, పథకాల సక్రమ అమలుకు అవకాశం ఉంటుంది.

News December 1, 2025

హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం: CBN

image

AP: విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించే పనిలో ఉన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏలూరు(D) నల్లమాడులో పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన అక్కడి సభలో మాట్లాడారు. ‘94% స్ట్రైక్ రేట్‌తో గెలిపించారు. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం అమలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.