News April 12, 2024

కోడ్ ముగిసిన తర్వాతే ‘గృహజ్యోతి’కి కొత్త దరఖాస్తులు

image

TG: ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే గృహజ్యోతి(ఫ్రీ కరెంట్)కి కొత్త అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని విద్యుత్ పంపిణీ సంస్థలు తెలిపాయి. తొలుత 36లక్షల ఇళ్లకు జీరో కరెంట్ బిల్లులు జారీ చేశారు. రాష్ట్రంలో 86లక్షలకు పైగా అర్హులు ఉండటంతో మిగిలినవారి నుంచి దరఖాస్తులను కోడ్ ముగిసిన వెంటనే స్వీకరించనున్నారు. గతనెల జీరో బిల్లు జారీ చేసిన 36లక్షల కుటుంబాలకు ఈనెల యథావిధిగా పథకాన్ని వర్తింపజేస్తున్నారు.

Similar News

News December 14, 2025

వరించిన అదృష్టం.. డ్రాలో సర్పంచ్ పదవి

image

TG: మెదక్ మండలం చీపురుదుబ్బ తండా సర్పంచ్‌గా కేతావత్ సునీత డ్రాలో విజయం సాధించారు. మొత్తం 377 ఓట్లు ఉండగా 367 ఓట్లు పోలయ్యాయి. సునీత (కాంగ్రెస్), బీమిలి(బీఆర్ఎస్) ఇద్దరికి 182 చొప్పున సమానంగా ఓట్లు వచ్చాయి. రెండు ఓట్లు చెల్లనివి, ఒకటి NOTAకు పడింది. ఇద్దరికీ సమానంగా రావడంతో రిటర్నింగ్ అధికారి వెంకటయ్య డ్రా తీశారు. కాంగ్రెస్ బలపరిచిన మహిళా అభ్యర్థి కేతావత్ సునీతను విజయం వరించింది.

News December 14, 2025

విమాన వేంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటారు?

image

విమాన వేంకటేశ్వర స్వామి వారు శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయ గోపురం దక్షిణ భాగంలో దర్శనమిస్తారు. ఈ మూర్తి ఆలయ మూలవిరాట్టులాగే ఉంటుంది. శ్రీవారి భక్తుడైన తొండమాన్ చక్రవర్తి దీనిని ఏర్పాటు చేశారని వేంకటాచల మాహాత్మ్యం చెబుతోంది. భక్తులు సులభంగా దర్శించుకునేందుకు వీలుగా గోపురం వద్ద వెండి మకర తోరణం ఏర్పాటు చేశారు. అలాగే బాణం గుర్తు కూడా ఉంటుంది. ఈ స్వామివారిని దర్శించడం విశేషంగా భావిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News December 14, 2025

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

image

AP: అనకాపల్లి సమీపంలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌(BARC)ను ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 3వేల ఎకరాల్లో ఈ కేంద్రం ఏర్పాటుకానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే సేకరించిన భూమిని ఆనుకొని ఉన్న 148.15 హెక్టార్ల రెవెన్యూ భూమిని తమకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రక్షణపరంగా విశాఖ తీరం ఈ సెంటర్ ఏర్పాటుకు అనువైనదిగా భావించి కేంద్ర ప్రభుత్వం ఈ ఏరియాను ఎంపిక చేసింది.