News April 12, 2024
కోడ్ ముగిసిన తర్వాతే ‘గృహజ్యోతి’కి కొత్త దరఖాస్తులు

TG: ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే గృహజ్యోతి(ఫ్రీ కరెంట్)కి కొత్త అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని విద్యుత్ పంపిణీ సంస్థలు తెలిపాయి. తొలుత 36లక్షల ఇళ్లకు జీరో కరెంట్ బిల్లులు జారీ చేశారు. రాష్ట్రంలో 86లక్షలకు పైగా అర్హులు ఉండటంతో మిగిలినవారి నుంచి దరఖాస్తులను కోడ్ ముగిసిన వెంటనే స్వీకరించనున్నారు. గతనెల జీరో బిల్లు జారీ చేసిన 36లక్షల కుటుంబాలకు ఈనెల యథావిధిగా పథకాన్ని వర్తింపజేస్తున్నారు.
Similar News
News December 24, 2025
CBSEలో 124 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (<
News December 24, 2025
ఆ బడులు తాత్కాలికంగా క్లోజ్!

TG: రాష్ట్రంలో విద్యార్థులు లేని 1,441 స్కూళ్లను తాత్కాలికంగా మూసేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థులు చేరితే మళ్లీ రీఓపెన్ చేయనుంది. అటు మరో 600 స్కూళ్లలో టీచర్లు ఉన్నా పిల్లలు లేరు. దీంతో వీరిని టీచర్ల కొరత ఉన్నచోటకు పంపించింది. కేంద్ర లెక్కల ప్రకారం జీరో ఎన్రోల్మెంట్లో రాష్ట్రం తొలిస్థానంలో ఉంది. దీంతో ప్రభుత్వ బడుల పనితీరు గ్రేడింగ్(PGI) పడిపోకుండా బడులను మూసేస్తున్నారు.
News December 24, 2025
శని దోష నివారణకు పఠించాల్సిన మంత్రాలివే..

* శని గాయత్రీ మంత్రం: ‘ఓం శనైశ్చరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్’
* ఆదిత్య హృదయం: ‘నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః| జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః||’
* శని అష్టోత్తర శతనామావళిలోని కొన్ని ముఖ్య నామాలు:
ఓం శనైశ్చరాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం సర్వాభీష్టప్రదాయినే నమః, ఓం శరణ్యాయ నమః, ఓం సౌమ్యాయ నమః


