News April 12, 2024

కోడ్ ముగిసిన తర్వాతే ‘గృహజ్యోతి’కి కొత్త దరఖాస్తులు

image

TG: ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే గృహజ్యోతి(ఫ్రీ కరెంట్)కి కొత్త అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని విద్యుత్ పంపిణీ సంస్థలు తెలిపాయి. తొలుత 36లక్షల ఇళ్లకు జీరో కరెంట్ బిల్లులు జారీ చేశారు. రాష్ట్రంలో 86లక్షలకు పైగా అర్హులు ఉండటంతో మిగిలినవారి నుంచి దరఖాస్తులను కోడ్ ముగిసిన వెంటనే స్వీకరించనున్నారు. గతనెల జీరో బిల్లు జారీ చేసిన 36లక్షల కుటుంబాలకు ఈనెల యథావిధిగా పథకాన్ని వర్తింపజేస్తున్నారు.

Similar News

News April 6, 2026

ఇరాన్, USకు సీజ్‌ఫైర్ ప్లాన్.. ఏం జరగబోతోంది?

image

యుద్ధాన్ని ఆపేందుకు ఇరాన్, USకు సీజ్‌ఫైర్ ప్లాన్ అందినట్లు Reuters తెలిపింది. వెంటనే కాల్పుల విరమణకు ఒప్పుకోవాలని, హార్ముజ్‌ను ఓపెన్ చేయాలని ప్రపోజల్స్ పెట్టినట్లు చెప్పింది. ఈ డ్రాఫ్ట్ ప్లాన్‌ను పాక్ రూపొందించినట్లు పేర్కొంది. అన్ని అంశాలపై ఈ రోజే అంగీకారం కుదరాలని సూచించినట్లు వెల్లడించింది. US ఉపాధ్యక్షుడు JD వాన్స్, ఇరాన్ మంత్రి అరాఘ్చీతో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ చర్చించినట్లు తెలిపింది.

News April 6, 2026

డెలివరీ ఏజెంట్స్ లిఫ్ట్ వాడొద్దా.. మీరేమంటారు?

image

ప్రస్తుతం అన్నీ డోర్ డెలివరీలే. కానీ వాటిని చేరవేసే వారికి మాత్రం కనీస గౌరవం దక్కట్లేదు. కొన్ని అపార్ట్‌మెంట్లలో డెలివరీ బాయ్స్ లిఫ్ట్ వాడొద్దని ఆంక్షలు పెట్టి, వాడితే జరిమానాలు వేస్తున్నారు. 2AMకు కూడా మెట్లు ఎక్కి రావాలనే కస్టమర్ల ప్రవర్తన తమను అవమానపరచడమే అని ఓ డెలివరీ ఏజెంట్ చేసిన పోస్ట్ వైరలవుతోంది. వారు కూడా మనుషులేనని, వారికి కనీస మర్యాద ఇవ్వాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. మీ కామెంట్?

News April 6, 2026

ఏపీకి ఒకే ఒక్క రాజధాని అమరావతి: సీఎం

image

AP: అమరావతికి YCP తప్ప దేశంలోని అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని సీఎం చంద్రబాబు అనంతపురం సభలో అన్నారు. ఏపీకి ఒకే ఒక్క రాజధాని అమరావతి అని స్పష్టం చేశారు. నిన్నటి వరకు రాష్ట్రానికి అడ్రస్ లేకుండా చేశారని, ఇప్పుడు అమరావతి రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా చేశామన్నారు. రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు. అమరావతి అని పలకడం ఇష్టం లేక మావిగన్ అంటూ పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని ఫైరయ్యారు.