News August 26, 2025

బిహార్ ఎన్నికలకు ముందే బీజేపీకి కొత్త చీఫ్!

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొత్త జాతీయ అధ్యక్షుడిని నియమించాలని BJP అధిష్ఠానం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. 2020 నుంచి JP నడ్డా ఈ పదవిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తదుపరి అధ్యక్షుడి ఎంపికకు ఇప్పటికే కొంతమందిని షార్ట్‌లిస్ట్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక తర్వాత జాతీయ, పలు రాష్ట్రాల అధ్యక్షుల నియామక ప్రక్రియ తిరిగి స్టార్ట్ అవుతుందని పేర్కొన్నాయి.

Similar News

News August 26, 2025

ఈ నెల 29న క్యాబినెట్ భేటీ

image

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ నెల 29న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సీఎస్ రామకృష్ణారావు పాల్గొంటారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

News August 26, 2025

మహీంద్రా వర్సిటీలో డ్రగ్స్ కలకలం

image

TG: మేడ్చల్ జిల్లా సూరారంలోని మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ వాడకం కలకలం రేపింది. 50 మంది స్టూడెంట్స్ డ్రగ్స్ సేవిస్తున్నట్లు ఈగల్ టీమ్ గుర్తించింది. విద్యార్థులకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేసింది. వారి నుంచి 1.15 కేజీల గంజాయి, 47gms ఓజీ వీడ్ స్వాధీనం చేసుకుంది. అరెస్టయిన నలుగురిలో ఇద్దరు విద్యార్థులున్నారు. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసు దర్యాప్తులో ఈ వ్యవహారం బయటపడింది.

News August 26, 2025

OP సిందూర్ ముగియలేదు: రాజ్‌నాథ్ సింగ్

image

ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, విరామం ఇచ్చామని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. వైజాగ్‌లో ఉదయగిరి, హిమగిరి వార్ షిప్‌లను మంత్రి జాతికి అంకితమిచ్చారు. ‘2050 నాటికి దేశంలో 200 యుద్ధ నౌకలు నిర్మించనున్నాం. వేర్వేరు చోట్ల రూపొందించిన రెండు యుద్ధ నౌకలను ఒకేసారి జలప్రవేశం చేయించడం ఇదే తొలిసారి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ నౌకలు మన దేశ ప్రతీకగా నిలుస్తున్నాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.