News November 18, 2024
నేటి నుంచి కొత్త ఈవీ పాలసీ

TG: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి కొత్త ఈవీ పాలసీ అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులో 100% మినహాయింపు ఇవ్వనుంది. బైక్స్, ఆటోలు, ఫోర్ వీలర్స్, కమర్షియల్ వెహికల్స్, ట్రాక్టర్లు ఈవీలు అయితే వాటికీ ఇది వర్తిస్తుంది. ఈ పాలసీ 2026, DEC 31 వరకు అమలులో ఉంటుంది. RTC ఈవీ బస్సులు కొంటే వాటికి కూడా ట్యాక్స్ ఫ్రీ అమలవుతుందని మంత్రి పొన్నం తెలిపారు.
Similar News
News November 27, 2025
సారీ.. అంచనాలు అందుకోలేకపోయాం: పంత్

తాము సరిగ్గా ఆడలేదని ఒప్పుకోవడానికి సిగ్గు పడట్లేదని కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపారు. ‘జట్టుగా, వ్యక్తిగతంగా మేమెప్పుడూ హయ్యెస్ట్ లెవల్లో పర్ఫార్మ్ చేసి కోట్లమంది భారతీయుల ముఖాల్లో చిరునవ్వు తేవాలనుకుంటాం. ఈసారి ఆ అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమించండి. దేశానికి ప్రాతినిధ్యం వహించడం మాకు గర్వకారణం. ఈ జట్టు ఏం చేయగలదో మాకు తెలుసు. ఈసారి జట్టుగా, వ్యక్తిగతంగా మంచి కంబ్యాక్ ఇస్తాం’ అని ట్వీట్ చేశారు.
News November 27, 2025
భారీ వర్షాలు.. రైతులకు కీలక సూచనలు

భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రైతులకు కొన్ని సూచనలు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల వరి కోతల సీజన్ నడుస్తోంది. కోత పూర్తైన వరి పంటను/ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రైతులకు సూచించింది. ధాన్యాన్ని కుప్పలుగా పోసి టార్పాలిన్ కప్పాలని, ఒకవేళ వానకు ధాన్యం తడిస్తే రంగుమారకుండా, మొలకెత్తకుండా వ్యవసాయ నిపుణుల సూచనలు పాటించాలని కోరింది.
News November 27, 2025
30 రోజుల్లో 1400 భూకంపాలు

ఇండోనేషియాలో గత 30 రోజుల్లో 1,400కు పైగా భూకంపాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా సుమత్రా దీవిలో 6.3 తీవ్రతతో భూకంపం రాగా.. ఆషే ప్రావిన్స్ సమీపంలో 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇప్పటికే సైక్లోన్ సెన్యార్ కారణంగా సుమత్రా దీవిలో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి 25 మంది మృతి చెందారు. ఇండోనేషియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్పై ఉండడం వల్ల తరచూ భూకంపాలు వస్తుంటాయి.


