News July 25, 2024

గూగుల్ మ్యాప్స్ నుంచి కొత్త ఫీచర్లు(2/2)

image

ప్రస్తుతం ఈ ఫీచర్లను హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్‌తో సహా 8 నగరాల్లోని ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలోనే IOS యూజర్లతో పాటు అన్ని నగరాలకు విస్తరించనుంది. మరో ఫీచర్ ప్రయాణ మార్గంలో ఫ్లైఓవర్లను గుర్తించి ఏ మార్గంలో వెళ్లాలో సూచిస్తుంది. దీంతో పాటు ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల సమాచారాన్ని అందించేలా మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

Similar News

News January 19, 2026

మీరు చేస్తేనే పిల్లలు నేర్చుకుంటారు

image

కొందరు తల్లిదండ్రులు మా పిల్లలకు ఏం చెబుతున్నా చెయ్యట్లేదు. మాట వినట్లేదు అని బాధపడుతుంటారు. కానీ పెద్దలను చూసే పిల్లలు ఏదైనా పాటిస్తారంటున్నారు నిపుణులు. మనం తీసుకొనే ఆహారం నుంచి వ్యాయామం వరకు వాళ్లు చూసే నేర్చుకుంటారు. సానుకూలంగా ఆలోచించడం, క్లిష్టపరిస్థితుల్లో ధైర్యంగా ఉండటం పేరెంట్స్‌ని చూసే నేర్చుకుంటారు. అలాగే వారి మాటలను శ్రద్ధగా వింటేనే తమ మనసులోని మాటలు స్వేచ్ఛగా పంచుకోగలుగుతారు.

News January 19, 2026

పండ్లు Vs పండ్ల రసాలు.. ఏవి బెటర్?

image

పండ్ల రసం తాగడం కంటే నేరుగా పండ్లను తినడమే చాలా ఉత్తమమని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. ‘ఫ్రూట్స్‌లో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. కానీ పండ్ల రసంలో పీచుపదార్థాలు ఎక్కువగా తొలగిపోతాయి. దీంతో చక్కెర స్థాయులు వేగంగా పెరుగుతాయి. డయాబెటిస్, PCOD, ఒబెసిటీ, గుండె వ్యాధులు ఉన్న వారికి జ్యూస్ మంచిది కాదు’ అని చెబుతున్నారు.

News January 19, 2026

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

image

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని విచారించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొంది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.