News December 24, 2024
మణిపుర్కు కొత్త గవర్నర్.. కేంద్రం వ్యూహం ఇదేనా?

అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపుర్లో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా అజయ్ కుమార్ భల్లాను నియమించింది. గతంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆయన్ను అనూహ్యంగా తెరమీదకు తేవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. శాంతి భద్రతల అంశాల్లో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉన్న కారణంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Similar News
News October 31, 2025
IND, AUS మ్యాచులో నమోదైన రికార్డులు

* ఉమెన్స్ ODIsలో హైయెస్ట్ రన్ ఛేజ్ ఇదే(339)
* WC నాకౌట్ మ్యాచులో ఇదే ఫస్ట్ 300+ రన్ ఛేజ్
* ఉమెన్స్ ODI WC ఫైనల్కు భారత్ రావడం ఇది మూడోసారి. 2005, 2017లో రన్నరప్గా నిలిచింది
* WCలో AUS వరుస విజయాలకు(15M తర్వాత) బ్రేక్
* WC నాకౌట్ మ్యాచుల్లో ఛేజింగ్లో సెంచరీ చేసిన రెండో ప్లేయర్గా జెమీమా
* ఉమెన్స్ వన్డేల్లో 2 ఇన్నింగ్స్లు కలిపి ఇది సెకండ్ హైయెస్ట్ స్కోర్-679
News October 31, 2025
బాహుబలి యూనివర్స్లో కొత్త సినిమా ప్రకటన

బాహుబలి యూనివర్స్లో ‘బాహుబలి-ది ఎటర్నల్ వార్’ పేరిట 3D యానిమేటెడ్ మూవీ రాబోతోంది. ‘బాహుబలి-ది ఎపిక్’ సినిమా చివర్లో ఈ 3D మూవీ టీజర్ను థియేటర్లలో ప్లే చేశారు. 2027లో తొలి పార్ట్ రిలీజ్ కానుంది. కొత్త కథతో రూ.120కోట్ల బడ్జెట్తో దీనిని రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. రాజమౌళి సమర్పణలో ఇషాన్ శుక్లా తెరకెక్కించనున్నారు. ఇందులో ఇంద్రుడు, బాహుబలి మధ్య యుద్ధాన్ని చూపిస్తారని తెలుస్తోంది.
News October 31, 2025
₹39,216 కోట్ల ఒప్పందాలపై విశాఖ పోర్టు సంతకాలు

AP: ముంబైలో జరిగిన మారిటైమ్ వీక్-2025 సమావేశాల్లో విశాఖపట్నం పోర్టు అథారిటీ(VPA) ₹39,216 కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంది. దుగరాజపట్నంలో మేజర్ పోర్ట్ కమ్ షిప్ బిల్డింగ్&రిపేర్ క్లస్టర్ ఏర్పాటు కోసం AP ప్రభుత్వంతో ₹29,662 కోట్ల ఒప్పందం చేసుకుంది. మెకాన్ ఇండియాతో ₹3,000 కోట్లు, NBCCతో ₹500 కోట్లు, హడ్కోతో ₹487.38 కోట్లు, రైల్ వికాస్ నియమిటెడ్తో ₹535 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంది.


