News December 11, 2024
బాధ్యతలు స్వీకరించిన RBI కొత్త గవర్నర్

IAS అధికారి సంజయ్ మల్హోత్ర RBI 26వ గవర్నర్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. నేటి నుంచి మూడేళ్ల వరకు ఆయన సేవలందిస్తారు. ‘పీస్టైమ్ జనరల్’గా పేరున్న ఆయన భారత ఎకానమీని పరుగులు పెట్టించాల్సి ఉంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసి, వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరం ఉంది. జనవరిలో రెపోరేటును తగ్గిస్తారని తెలుస్తోంది. రెవెన్యూ సెక్రటరీగా ఆయనకు మంచి అనుభవం ఉంది. ట్యాక్సేషన్, ఎకానమీ అంశాలపై పట్టుంది.
Similar News
News November 21, 2025
హనుమాన్ చాలీసా భావం – 16

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |
రామ మిలాయ రాజ పద దీన్హా ||
హనుమంతుడు నిస్సహాయ స్థితిలో ఉన్న సుగ్రీవునికి గొప్ప ఉపకారం చేశాడు. అతనికి శ్రీరాముడిని పరిచయం చేసి, ఆ మైత్రి ద్వారా కోల్పోయిన రాజ్యపదవిని తిరిగి ఇప్పించాడు. సమయస్ఫూర్తితో, సరైన మార్గదర్శకత్వంతో, నిస్వార్థ స్నేహ బంధాన్ని ఏర్పరచి ధర్మ సంస్థాపనకు తోడ్పడ్డాడు. ఆపదలో ఉన్నవారికి సాయపడే ఆంజనేయుడి నిరతి అందరికీ ఆదర్శం. <<-se>>#HANUMANCHALISA<<>>
News November 21, 2025
DWCWEOలో ఉద్యోగాలు

AP:బాపట్లలోని డిస్ట్రిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్& ఎంపవర్మెంట్ ఆఫీస్ 8 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీబీఎస్, ఇంటర్, బీఏ(సోషల్ వర్క్/సోషియాలజీ/సోషల్ సైన్సెస్), డిగ్రీ, బీఈడీ, 7వ తరగతి అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 25-42ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్సైట్: https://bapatla.ap.gov.in/
News November 21, 2025
అరటి రైతుల ఆక్రందనలు పట్టట్లేదా: షర్మిల

AP: అరటి రైతుల ఆక్రందనలు కూటమి ప్రభుత్వానికి పట్టకపోవడం సిగ్గుచేటు అని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల మండిపడ్డారు. అరటి టన్ను ధర రూ.28వేల నుంచి రూ.వెయ్యికి పడిపోయిందన్నారు. కిలో రూపాయికి అమ్ముకోలేక కష్టపడి పండించిన అరటిని పశువులకు మేతగా వేస్తుంటే రైతు సంక్షేమం ఎక్కడుంది? అని ఫైరయ్యారు. ప్రభుత్వం తక్షణమే రైతుల బాధలను వినాలని, టన్నుకు రూ.25వేలు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు.


