News August 25, 2025
వచ్చే నెల 22 నుంచి కొత్త జీఎస్టీ శ్లాబ్స్!

పండగ డిమాండ్ నేపథ్యంలో వచ్చే నెల 22 నుంచి GST కొత్త శ్లాబ్స్ అమలు కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 3,4 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. GSTని సరళీకరిస్తూ అన్ని వస్తువులపై ట్యాక్స్ను రెండు శ్లాబ్స్(5%, 18%)కు పరిమితం చేయాలని కేంద్రం భావిస్తున్న విషయం తెలిసిందే. మీటింగ్లో చర్చించి వీటిపై కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుంది. అయితే లగ్జరీ వస్తువులకు మాత్రం 40% GST ఉండనుంది.
Similar News
News August 25, 2025
యాపిల్ ఫోల్డబుల్ ఫోన్లో 4 కెమెరాలు!

యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయో ‘బ్లూమ్బర్గ్’ మార్క్ గుర్మన్ అంచనా వేశారు. ‘ఫ్లిప్ కాకుండా యాపిల్ కంపెనీ ఫోల్డబుల్ ఫోన్ బుక్ స్టైల్లో ఉంటుంది. ఇందులో ఫేస్ ఐడీ కాదు టచ్ ఐడీ ఉంటుంది. సీ2 మోడెమ్, 4 కెమెరాలు ఉంటాయి. కేవలం ఈ-సిమ్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది’ అని తెలిపారు. దీని ధర రూ.1,74,900 వరకు ఉండొచ్చని, 2026లో విడుదలయ్యే అవకాశాలున్నాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
News August 25, 2025
మానవ మృగాలు ఫామ్హౌస్లో ఉన్నాయి: CM రేవంత్

TG: ప్రతిపక్ష నేతలే టార్గెట్గా OUలో CM రేవంత్ పరోక్షంగా విమర్శలు చేశారు. ‘సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఏనుగులు ఉన్నాయని అభివృద్ధి కాకుండా అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఏనుగులు, సింహాలు లేవు. కేవలం మానవ రూపంలో ఉన్న మృగాలే ఉన్నాయి. అవి కూడా ఫామ్హౌజ్లో ఉన్నాయి. వాటిని నిర్బంధించడానికి వలలు వేయండి. లేని ఏనుగులు, సింహాలను నేను చంపేస్తున్నానని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు’ అని రేవంత్ మండిపడ్డారు.
News August 25, 2025
ఇష్టారీతిన బిల్డింగులు కట్టొద్దు: నారాయణ

AP: గత ప్రభుత్వంలో ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఇష్టమొచ్చినట్లు బిల్డింగ్స్ కట్టారని మంత్రి నారాయణ ఆరోపించారు. ‘ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ ఇప్పటికే ఇచ్చాం. బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీమ్పై వర్క్ చేస్తున్నాం. నెలనెలా శాటిలైట్ పిక్చర్స్ స్టడీ చేసి.. ప్లానింగ్కి డీవియేషన్ ఉంటే CM చర్యలు తీసుకోమన్నారు. ఎవరైనా సరే డీవియేషన్ లేకుండా భవనాలు కట్టుకోండి. తేడాలుంటే ఇబ్బందులు పడతారు’ అని విజ్ఞప్తి చేశారు.