News March 26, 2025
IPLలో సరికొత్త చరిత్ర

IPL 2025 సరికొత్త జోష్తో కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచుల్లో సగటున 3.9 బంతులకు ఫోర్, 9.9 బంతులకు సిక్సర్ నమోదైంది. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఈ స్థాయిలో దూకుడుగా ఆడటం ఇదే తొలిసారి. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో కనీసం 20+ పరుగులు నమోదైన ఓవర్లు 20 ఉన్నాయి. ఇక ప్రారంభంలోనే SRH 286 పరుగులు చేసి 300 పరుగులు కొట్టేస్తామని ఇతర జట్లకు హెచ్చరికలు జారీ చేసింది.
Similar News
News March 29, 2025
సౌదీలో కనిపించిన చంద్రుడు.. ఇండియాలో ఎల్లుండి రంజాన్

సౌదీ అరేబియాలో చంద్రుడు దర్శనమిచ్చాడు. దీంతో ఆ దేశంలో రేపు (మార్చి 30) ఈద్-ఉల్-ఫితర్ జరుపుకోనున్నారు. ఉ.6.30 గంటలకు అక్కడి మసీద్ అల్ హరామ్లో ఈద్ ప్రార్థనలు జరుగుతాయి. ఆ తర్వాతి రోజు అంటే మార్చి 31న ఇండియాలో రంజాన్ పండుగను సెలబ్రేట్ చేసుకోనున్నారు.
News March 29, 2025
ఏప్రిల్ 8న బన్నీ కొత్త సినిమా ప్రకటన?

అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్లో AA22 మూవీకి రంగం సిద్ధమైనట్లు సమాచారం. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న సినిమాపై అధికారిక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆయన డబుల్ రోల్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఫ్యాన్ మేడ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పుష్ప-2 బ్లాక్ బస్టర్ తర్వాత తెరకెక్కే చిత్రం కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి.
News March 29, 2025
రాత్రి పూట అరటి పండు తింటే..

రాత్రిపూట అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి హానికరం అని ఏ సైంటిఫిక్ రిసెర్చూ తేల్చలేదు. అయితే ఆయుర్వేదం ప్రకారం రాత్రి అరటి పండు తింటే శ్లేష్మం ఉత్పత్తి అయి జలుబు చేస్తుంది. దగ్గు, గొంతు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అరటి పండును ఉదయం అల్పాహారంతో కలిపి తీసుకుంటే ఎక్కువ లాభాలు ఉంటాయని డాక్టర్లు తెలిపారు.