News October 22, 2024

దేశవ్యాప్తంగా 2 కోట్ల మందికి నూతనంగా ఇళ్లు: పెమ్మసాని

image

AP: PM ఆవాస్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా రెండు కోట్ల నూతన గృహాల లబ్ధిదారులకు ఎంపిక చేస్తామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ‘ఆవాస్’ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా అర్హుల ఎంపిక పారదర్శకంగా చేస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో గృహ నిర్మాణ రంగం కుంటుపడిందని మంత్రి పార్థసారధి విమర్శించారు.

Similar News

News October 22, 2024

దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెరగాలి: కిషన్ రెడ్డి

image

TG: దేశంలో పవర్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి జరగాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దిగుమతులు తగ్గించుకుంటూ దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచే దిశగా మరింత కృషి జరగాలన్నారు. అవసరమైన చోట నిబంధనలు మార్చడానికి సైతం ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్మికులు, గనుల కోసం భూములు వదిలి వెళ్తున్న వారి సంక్షేమం కోసం MDOలు ఆలోచించాలని సూచించారు. ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యమివ్వాలన్నారు.

News October 22, 2024

ఈ సింగర్ ఆస్తి రూ.లక్ష కోట్లు!

image

సింగర్, పాటల రచయితగా సంగీత ప్రియులకు దగ్గరైన అనన్య శ్రీ బిర్లా అత్యంత ధనవంతురాలని చాలా మందికి తెలియదు. బిలియనీర్ కుమార్ మంగళం బిర్లా పెద్ద కుమార్తెనే ఈ అనన్య బిర్లా. ఆమె 2016లో సంగీతరంగ ప్రవేశం చేసి అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు. 28 ఏళ్ల వయసులోనే ఆమె ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ (ABFRL) డైరెక్టర్‌‌గా పనిచేస్తున్నారు. ఆమె నెట్‌వర్త్ $13 బిలియన్లు (రూ.లక్ష కోట్ల పైనే).

News October 22, 2024

మెడికల్ కాలేజీకి పింగళి వెంకయ్య పేరు పెట్టడం హర్షనీయం: పవన్

image

AP: మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. కళాశాలకు ఆ మహనీయుడి పేరు పెట్టడం ద్వారా ఆయన ఇచ్చిన స్ఫూర్తి భవిష్యత్తు తరాలకు అందుతుందని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ప్రజల్లో స్ఫూర్తి నింపేలా ఆయన జాతీయ జెండాను రూపొందించి జాతికి అందించారని కొనియాడారు.