News February 13, 2025

నేడు పార్లమెంటు ముందుకు కొత్త ఐటీ బిల్లు

image

నేడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో కొత్త ఆదాయపు పన్ను బిల్లు-2025ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకు ఫైనాన్షియల్ ఇయర్, అసెస్‌మెంట్ ఇయర్ అనేవి ఉండగా ఇక నుంచి ‘ట్యాక్స్ ఇయర్’ అనే కాన్సెప్ట్ మాత్రమే ఉండనుంది. ఇది ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ఈ కొత్త బిల్లు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అలాగే భాష సరళీకరణంగా ఉండనుంది. కొత్త బిల్లులో 526 సెక్షన్లు ఉండనున్నాయి.

Similar News

News February 13, 2025

SnapChatలో రికార్డు సృష్టించారు!

image

మీరెప్పుడైనా స్నాప్‌చాట్ వాడారా? అందులో ఇద్దరు స్నేహితులు కలిసి స్నాప్ పంపించుకుంటే స్ట్రీక్ స్టార్ట్ అవుతుంది. రోజూ ఒక స్నాప్ (ఫొటో/వీడియో) పంపిస్తుంటే స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది. ఇలా కాటీ &ఎరిన్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ 3662+ స్ట్రీక్‌తో రికార్డు సృష్టించారు. అంటే వీరి స్నాప్ జర్నీ పదేళ్లు దాటిందన్న మాట. వీరి తర్వాత లెస్లీ & జయ్నబ్ (3536+), ఎర్మిరా & జవి (3528+) ఉన్నారు. మీ హైయెస్ట్ స్ట్రీక్స్ ఎంత?

News February 13, 2025

బీసీల నుంచి ముస్లింలను తొలగించాలి.. బండి డిమాండ్

image

TG: రిజర్వేషన్ల అంశంలో బీసీ కేటగిరీ నుంచి ముస్లింలను తొలగించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే హిందూ సమాజం నుంచి తిరుగుబాటు తప్పదని, MLC ఎన్నికల్లో INC మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మతాల ఆధారంగా రిజర్వేషన్లకు BJP వ్యతిరేకమని స్పష్టం చేశారు. BC రిజర్వేషన్ల వ్యవహారాన్ని INC ప్రభుత్వం కేంద్రంపై నెట్టడానికి చూస్తోందని మండిపడ్డారు.

News February 13, 2025

మనుషుల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు ఇవే

image

బర్డ్ ఫ్లూ సోకిన పక్షులను (చనిపోయిన లేదా సజీవంగా) తాకడం, చంపడం, దగ్గరగా మెలగడం ద్వారా మనుషులకు ఆ వైరస్ సోకుతుంది. కండరాల నొప్పి, దగ్గు, ఊపిరి ఆడకపోవడం, తలనొప్పి, కడుపు నొప్పి, అతిసారం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత 3-5 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. దీని నివారణకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ ఏమీ లేదు. టామీఫ్లూ, రెవెంజా వంటి యాంటీ వైరల్ డ్రగ్స్ వాడుతారు. చనిపోయే ప్రమాదం చాలా తక్కువ.

error: Content is protected !!