News June 15, 2024
త్వరలో కొత్త ఐటీ పాలసీ: నారా లోకేశ్

AP: విశాఖను IT, తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్స్గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. IT, ఎలక్ట్రానిక్స్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. APకి కంపెనీలను రప్పించడానికి ఎలాంటి ప్రోత్సాహకాలివ్వాలనే దానిపై చర్చించారు. త్వరలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పాలసీ తెస్తామని లోకేశ్ చెప్పారు. పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా ప్రత్యేకంగా ఆహ్వానించాలని సూచించారు.
Similar News
News October 31, 2025
2,790 మంది ఇండియన్స్ను US తిరిగి పంపింది: కేంద్రం

చట్ట వ్యతిరేకంగా తమ దేశంలోకి అడుగుపెట్టిన ఇతర దేశస్థులను అమెరికా వెనక్కి పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో ఇప్పటివరకు US నుంచి 2,790 మంది భారతీయులు స్వదేశానికి తిరిగొచ్చారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. వీరంతా అక్కడ చట్టవిరుద్ధంగా, నిబంధనలను అతిక్రమించి నివసించారని పేర్కొన్నారు. అటు 2025లో ఇప్పటివరకు దాదాపు 100 మంది అక్రమవలసదారులను UK తిరిగి పంపిందని తెలిపారు.
News October 31, 2025
నేటి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ ఇవాళ్టి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతు కోరుతూ నేడు వెంగళరావునగర్, సోమాజీగూడ డివిజన్లలో జరిగే సభల్లో పాల్గొంటారు. రేపు బోరబండ, ఎర్రగడ్డ, 4న షేక్పేట్-1, రహమత్ నగర్, 5న షేక్పేట్-2, యూసుఫ్గూడలో రోడ్ షో, 8, 9తేదీల్లో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ తేదీల్లో ఆయన రాత్రి 7 గంటల నుంచి ప్రచారంలో పాల్గొంటారు.
News October 31, 2025
IND, AUS మ్యాచులో నమోదైన రికార్డులు

* ఉమెన్స్ ODIsలో హైయెస్ట్ రన్ ఛేజ్ ఇదే(339)
* WC నాకౌట్ మ్యాచులో ఇదే ఫస్ట్ 300+ రన్ ఛేజ్
* ఉమెన్స్ ODI WC ఫైనల్కు భారత్ రావడం ఇది మూడోసారి. 2005, 2017లో రన్నరప్గా నిలిచింది
* WCలో AUS వరుస విజయాలకు(15M తర్వాత) బ్రేక్
* WC నాకౌట్ మ్యాచుల్లో ఛేజింగ్లో సెంచరీ చేసిన రెండో ప్లేయర్గా జెమీమా
* ఉమెన్స్ వన్డేల్లో 2 ఇన్నింగ్స్లు కలిపి ఇది సెకండ్ హైయెస్ట్ స్కోర్-679


