News February 1, 2025
కొత్త ఐటీ శ్లాబ్లు ఇవే

బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మల కొత్త ఆదాయపు పన్ను శ్లాబులను ప్రకటించారు.
*0-4 లక్షల వరకు NIL
*రూ.4 లక్షల-8 లక్షల వరకు 5%
*8 లక్షల-12 లక్షల వరకు 10%
*12 లక్షల-16 లక్షల వరకు 15%
*16 లక్షల- 20 లక్షల వరకు 20 %
*20 లక్షల-24 లక్షల వరకు 25%
*24 లక్షలకు పైగా 30% ట్యాక్స్ ఉండనుంది.
Similar News
News February 10, 2026
రైల్వే జోన్పై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వండి: CBN

కొత్త రైలు మార్గాలకు సంబంధించి కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్కు CM చంద్రబాబు విజ్ఞాపన పత్రం అందచేశారు. బడ్జెట్లో ప్రకటించిన హైస్పీడ్ రైల్ కారిడార్లపై భేటీలో ప్రస్తావించారు. ‘ద.కో.రైల్వేజోన్ కార్యకలాపాలు APR1 నుంచి ప్రారంభమయ్యేలా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. బెంగళూరు-చెన్నై హై స్పీడ్ రైల్ కారిడార్ను తిరుపతికి కనెక్ట్ చేసేలా చూడాలి. TPT మీదుగా VJA-బెంగళూరు మధ్య వందేభారత్ సర్వీస్ నడపాలి’ అని కోరారు.
News February 10, 2026
పార్లమెంట్ను కుదిపేస్తున్న పుస్తకం

పబ్లిష్ కూడా కాకుండానే ఒక పుస్తకం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్మీ మాజీ చీఫ్ నరవణె <<19098532>>రాసిన <<>>‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’పై అధికార, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఈ బుక్ ఏకంగా పార్లమెంట్ సమావేశాలనే స్తంభింపజేసింది. ఒకరోజు PM సభకు రాకుండా చేసింది. ఈ వివాదం LS స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానానికి దారితీసింది. ఈ ప్రక్రియ ముగిసేవరకు సభకు రావద్దని తాజాగా ఆయన నిర్ణయించుకున్నారు.
News February 10, 2026
RTCలో 7,673 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు

AP: RTCలో 7,673 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. సచివాలయంలో ఇవాళ మంత్రి సమీక్ష నిర్వహించారు. 2028లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ కానున్నారని, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్ తదితర పోస్టులకు ప్రాధాన్యతతో భర్తీ చేయాలని ఆయన సూచించారు. 2025-26 DPC కింద అర్హులైన 7,514 మంది ఉద్యోగులకు ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.


