News February 1, 2025
కొత్త ఐటీ శ్లాబ్లు ఇవే

బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మల కొత్త ఆదాయపు పన్ను శ్లాబులను ప్రకటించారు.
*0-4 లక్షల వరకు NIL
*రూ.4 లక్షల-8 లక్షల వరకు 5%
*8 లక్షల-12 లక్షల వరకు 10%
*12 లక్షల-16 లక్షల వరకు 15%
*16 లక్షల- 20 లక్షల వరకు 20 %
*20 లక్షల-24 లక్షల వరకు 25%
*24 లక్షలకు పైగా 30% ట్యాక్స్ ఉండనుంది.
Similar News
News February 13, 2026
గుడ్ న్యూస్.. బెంగళూరులో ఆర్సీబీ మ్యాచులు

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచుల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ తెలిపారు. జస్టిస్ మైఖేల్ డి కున్హా సిఫార్సులను అమలు చేయనున్నట్లు Xలో వెల్లడించారు. టికెట్లు, ప్రేక్షకుల నియంత్రణ, స్టేడియం యాక్సెస్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. బాధ్యత, జవాబుదారీతనంతో ముందుకు వెళ్తామని చెప్పారు.
News February 13, 2026
మహాశివరాత్రి రోజు నాన్-వెజ్ అమ్మకాలపై నిషేధం

మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15న (ఆదివారం) బెంగళూరులో జంతు వధ, మాంసం అమ్మకాలను నిషేధిస్తూ గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) ఆదేశాలు జారీ చేసింది. అథారిటీ పరిధిలోని అన్ని చికెన్, మటన్, చేపల దుకాణాలు, కబేళాలను ఆ రోజు 24 గంటల పాటు మూసేయాలని ఆదేశించింది. సాంస్కృతిక ఆచారాలు, మతపరమైన సెంటిమెంట్ల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.
News February 13, 2026
మూడేళ్ల పోరాటం.. విజయవార్త వినకుండానే..

‘ఆమె ప్రాణాలకు విలువలేదు’ అనే దుర్మార్గపు మాటపై USలో మూడేళ్లుగా న్యాయపోరాటం చేసిన కందుల జాహ్నవి తండ్రి 2 రెండు రోజుల కిందటే గుండెపోటుతో చనిపోయారు. రూ.262 కోట్ల పరిహారం <<19117214>>ఇచ్చేందుకు<<>> సియాటెల్ విభాగం నిన్నే ఒప్పందం చేసుకుంది. కేసులో విజయం సాధించిన వార్త వినకముందే తండ్రి శ్రీకాంత్ చనిపోయారు. వీరిది కర్నూలు(D) కుంభళనూరు క్యాంప్ గ్రామం. ఉన్నతవిద్య కోసం US వెళ్లిన జాహ్నవి పోలీస్ వాహనం ఢీకొని చనిపోయారు.


