News January 15, 2025
హైకోర్టులకు కొత్త జడ్జిలు.. TGకి నలుగురు, APకి ఇద్దరు

తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ రేణుక, జస్టిస్ నందికొండ నర్సింగ్ రావు, జస్టిస్ తిరుమల దేవి, జస్టిస్ మధుసూదన్ రావు పేర్లను ప్రతిపాదించింది. కాగా నిన్న హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్ నియమితులైన విషయం తెలిసిందే. అటు ఏపీ హైకోర్టుకు అవధానం హరిహరనాథ శర్మ, యడవల్లి లక్ష్మణరావు పేర్లను కొలీజియం రిఫర్ చేసింది.
Similar News
News December 1, 2025
వ్యవసాయం కుదేలవుతుంటే చోద్యం చూస్తున్న CBN: జగన్

AP: వ్యవసాయం కుప్పకూలిపోతుంటే CM CBN రైతులను వారి విధికి వదిలేసి చోద్యం చూస్తున్నారని YCP చీఫ్ YS జగన్ మండిపడ్డారు. ‘హలో ఇండియా! AP వైపు చూడండి. అక్కడ KG అరటి ₹0.50 మాత్రమే. ఇది నిజం. రైతుల దుస్థితికిది నిదర్శనం. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. మా హయాంలో టన్ను అరటికి 25వేలు ఇచ్చాం. రైతులు నష్టపోకుండా ఢిల్లీకి రైళ్లు ఏర్పాటుచేశాం. కోల్డ్ స్టోరేజీలు పెట్టాం’ అని Xలో పేర్కొన్నారు.
News December 1, 2025
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని APSDMA వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ, ఉ.గోదావరి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయంది. ఇవాళ 5PM వరకు నెల్లూరు(D) కొడవలూరులో 38.7mm, నెల్లూరులో 36.7mm, తిరుపతి(D) తడలో 33.5MM వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.
News December 1, 2025
హీట్ పెంచుతున్న ‘హిల్ట్’!

TG: హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(HILT) పాలసీ రాజకీయంగా హీట్ పెంచుతోంది. ORR లోపల ఉన్న ఇండస్ట్రియల్ పార్కుల్లోని 9292 ఎకరాలను మల్టీయూజ్ జోన్లుగా మార్చుతామని, దీనివల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని GOVT చెబుతోంది. అయితే భూమిని తక్కువ ధరకు అమ్మేస్తున్నారని, ₹5L Cr స్కామ్ జరుగుతోందని BRS, BJP <<18438533>>విమర్శిస్తున్నాయి<<>>. తాజాగా గవర్నర్కు కంప్లైంట్ చేరింది. ఈ వివాదం ఎంతదూరం వెళ్తుందో?


