News November 28, 2024
తెలంగాణలో కొత్త మండలం.. మల్లంపల్లి

TG: ములుగు జిల్లాలోని మల్లంపల్లిని కొత్త మండలంగా ప్రకటిస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఎన్నికల సమయంలో మంత్రి సీతక్క మండలం ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చారు. దీంతో మల్లంపల్లి, రామచంద్రాపూర్ గ్రామాలతో ఈ మండలం ఏర్పాటు చేశారు. ములుగు రెవెన్యూ డివిజన్, జిల్లా పరిధిలోనే ఈ గ్రామం కొనసాగనుంది. పదేళ్లుగా స్థానికులు చేసిన పోరాటానికి ఫలితం దక్కిందంటూ సీఎం రేవంత్కు మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News November 25, 2025
మీకు తెలుసా?: యశోదమ్మే వకుళామాత

ద్వాపర యుగంలో కృష్ణుడి పెంపుడు తల్లి యశోదా కలియుగంలో శ్రీనివాసుడి పెంపుడు తల్లి వకుళామాతగా జన్మించింది. కళ్లారా కృష్ణుడి పెళ్లి చూడాలన్న యశోద కోరికను కలియుగంలో తీరుస్తానని కృష్ణుడు వరమిస్తాడు. అందుకే ఆమె ఆధ్వర్యంలోనే శ్రీనివాసుడి కళ్యాణం జరిగింది. నేటికీ తిరుమలలోని బంగారు బావి పక్కన ఉన్న పోటులో ఆమె ఆసీనులై ఉంటారట. భక్తులకు అందించే అన్న ప్రసాదాల తయారీని పర్యవేక్షిస్తారని నమ్ముతారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 25, 2025
చుండ్రుకు ఇలా చెక్

చలికాలంలో తలలో చుండ్రు ప్రభావం అధికంగా ఉంటుంది. దీనివల్ల దురద, డ్రై హెయిర్, హెయిర్ ఫాల్ సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించడంలో కరివేపాకు కీలకంగా పనిచేస్తుంది. కరివేపాకు, పెరుగు పేస్ట్ చేసి దాన్ని తలకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే జుట్టు సమస్యలు తగ్గుతాయి. అలాగే కరివేపాకు మరిగించిన నీటిని తలకు పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. దీని వల్ల కూడా చుండ్రు సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
News November 25, 2025
పిల్లలు నూడుల్స్, పాస్తా తింటే కలిగే నష్టాలు తెలుసా?

రిఫైన్డ్ ఫ్లోర్తో తయారు చేసే నూడుల్స్, పాస్తా తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. వీటిలో ఉండే అధిక సోడియంతో పిల్లల్లో బీపీ, గుండె, కిడ్నీ సమస్యలు వస్తాయి. మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ పెరిగి డయాబెటిస్, హై కొలెస్ట్రాల్కు దారితీస్తుంది. ప్రొటీన్స్, విటమిన్స్, ఫైబర్ తక్కువగా ఉండడంతో ఒబెసిటీ, పోషకాహార లోపం ఏర్పడుతుంది. జీర్ణక్రియ సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.


