News August 15, 2024
ఒలింపిక్ అథ్లెట్లకు అందుబాటులో కొత్త NCA: జైషా

నీరజ్ చోప్రా వంటి ఒలింపిక్ అథ్లెట్లూ కొత్త NCAను ఉపయోగించుకోవచ్చని BCCI కార్యదర్శి జైషా అన్నారు. ఇందులో అధునాతన వసతులు ఉంటాయన్నారు. వారణాసిలో స్టేడియం, జమ్ము- ఈశాన్య రాష్ట్రాల్లో 7 NCAలు నెలకొల్పుతామని ప్రకటించారు. బెంగళూరు NCAలో ప్రపంచ స్థాయి మైదానాలు, 45 ప్రాక్టీస్, ఇండోర్ క్రికెట్ పిచ్లు, ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్, అద్భుతమైన ట్రైనింగ్, రికవరీ, స్పోర్ట్స్ సైన్స్ సౌకర్యాలు ఉంటాయి.
Similar News
News February 9, 2026
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆశా వర్కర్ పోస్టులు

<
News February 9, 2026
అంధత్వాన్ని జయించి.. కేరళలో తొలి జడ్జిగా

‘సంకల్పం ముందు వైకల్యం ఎంత?’ అని నిరూపించారు కేరళకు చెందిన సి.తాన్యా నాథన్. అంధురాలైన తాన్యా కేరళలో తొలి అంధ మహిళా జడ్జిగా రికార్డుల్లోకి ఎక్కనున్నారు. ఇటీవల జరిగిన జుడీషియల్ సర్వీస్ పరీక్షలో దివ్యాంగుల కేటగిరీలో ఆమె ఫస్ట్ ర్యాంక్ సాధించారు. దృష్టి లోపం ఉన్న అభ్యర్థులూ న్యాయ వ్యవస్థలో విధుల నిర్వహణకు అర్హులని గతేడాది SC ఇచ్చిన తీర్పు ఆమె కలను నిజం చేసింది. బ్రెయిలీ లిపిలో ఆమె లా చదువుకున్నారు.
News February 9, 2026
ఎంత పడుకున్నా అలసట తీరట్లేదా?

రాత్రిళ్లు హాయిగా పడుకున్నా ఉదయం నిద్ర మత్తుగా ఉండటానికి విటమిన్ డీ లోపమే కారణమంటున్నారు నిపుణులు. ఇది మూడ్, శక్తిని నియంత్రించే సెరోటోనిన్ అనే న్యూరోట్రాన్స్మిటర్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. మధ్యాహ్నం సమయంలో శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయి సహజంగా తగ్గుతుంది. ఇలాంటప్పుడు విటమిన్ D లోపం ఉంటే నీరసం, నిద్ర వచ్చినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి విటమిన్ D సప్లిమెంట్స్, సమతుల్య ఆహారం తీసుకోవాలి.


