News February 26, 2025

దేశ ప్రజలందరికీ కొత్త పెన్షన్ స్కీం

image

దేశ ప్రజల కోసం యూనివర్సల్ పెన్షన్ స్కీం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 60 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ అందించేలా, నిర్మాణ కార్మికులు, గిగ్ వర్కర్లకు మేలు చేసే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత పెన్షన్ పథకాలనూ దీనిలో చేర్చే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్న, చేయని వారు, వ్యాపారం చేసే వారూ దీని ప్రయోజనాలు పొందేలా ప్లాన్ చేస్తోంది. త్వరలోనే దీని విధివిధానాలు ప్రకటించనున్నట్లు సమాచారం.

Similar News

News February 27, 2025

TODAY HEADLINES

image

* ఆదాయం పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం: CM రేవంత్
* సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ కీలక సూచనలు
* SLBC TUNNEL: రంగంలోకి BSF నిపుణులు
* సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్
* తెలంగాణ వ్యవసాయ కూలీల ఖాతాల్లో డబ్బులు జమ
* 36 సార్లు ఢిల్లీకి.. 3 రూపాయలు తేలేదు: KTR
* మార్చి 7న ‘ఛావా’ తెలుగు వెర్షన్ రిలీజ్
* విమాన ప్రమాదంలో 46కు చేరిన మరణాలు
* ఇంగ్లండ్‌పై అఫ్గానిస్థాన్ సంచలన విజయం

News February 27, 2025

పోసానిపై పలు జిల్లాల్లో కేసులు

image

AP వ్యాప్తంగా పలు జిల్లాల్లో సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదయ్యాయి. CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్, లోకేశ్‌ను అసభ్యకరంగా దూషించారని బాపట్ల, అనంతపురం, నర్సరావుపేట, చిత్తూరు(D) యాదమరి, తిరుపతి(D) పుత్తూరు, మన్యం(D) పాలకొండ, కర్నూలు, శ్రీకాకుళంలో ఫిర్యాదులు అందగా, కొన్నిచోట్ల కేసులు నమోదయ్యాయి. 2 రోజుల క్రితం అన్నమయ్య(D) ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసులో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.

News February 27, 2025

అఫ్గాన్ విజయం.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లండ్ ఔట్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌‌తో జరిగిన మ్యాచులో అఫ్గానిస్థాన్ 8 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఒకానొక దశలో అఫ్గాన్ ఓడిపోయేలా కనిపించినా, చివరి 2 ఓవర్లలో ఆ జట్టు బౌలర్లు ఇంగ్లండ్ వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పారు. దీంతో ఇంగ్లండ్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. 326 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ENG 317కు ఆలౌటైంది. ENG బ్యాటర్లలో రూట్ (120) సెంచరీతో రాణించినా ఫలితం లేకుండా పోయింది.

error: Content is protected !!