News March 23, 2025
మే నుంచి కొత్త పింఛన్లు: మంత్రి

AP: రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది కొత్తగా పింఛన్లకు అర్హులుగా ఉన్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. వారందరికీ త్వరలోనే మంజూరు చేస్తామని తెలిపారు. కొత్తగా 93 వేల మంది వితంతువులకు మే నెల నుంచి పింఛన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మహిళల స్వయం సాధికారత, ఉపాధి కల్పన కోసం విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News March 24, 2025
ఏఐ ఫీచర్లతో యాపిల్ వాచ్ కెమెరాలు!

కెమెరాలతో కూడిన సరికొత్త వాచ్లను యాపిల్ తీసుకురానుంది. AI సాంకేతికతతో ఇవి పనిచేయనున్నట్లు టెక్ వర్గాలు తెలిపాయి. కెమెరాల ద్వారా పరిసరాల గురించి సమాచారం అందించడంలో ఇవి ఉపయోగపడుతాయని పేర్కొన్నాయి. స్టాండర్డ్ మోడల్స్లో ముందు వైపు, అల్ట్రా మోడల్స్లో పక్కకు కెమెరాలు ఉంటాయని పేర్కొన్నాయి. అయితే ఇవి ఫేస్ టైమ్ కాల్స్ కోసం కాకుండా AI ఫీచర్స్ ను ఉపయోగించుకునేలా ఉంటాయని వెల్లడించాయి.
News March 24, 2025
అందుబాటులోకి పాన్ కార్డ్- 2.0!

పాన్ కార్డ్ 2.0 ప్రాజెక్ట్ మొదలైంది. ఇది ఓ సెక్యూర్ డాక్యుమెంట్. ఇకపై PAN కోసం అప్లై చేసుకుంటే ఏటీఎం కార్డు తరహాలో ఉండే ఈ పాన్ 2.0 జారీ అవుతుంది. దీనిపై ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్, చిప్ ఉంటుంది. సైబర్ మోసాల బారిన పడకుండా రక్షించడంలో ఈ కార్డు కీలక పాత్ర పోషించనుంది. ఫ్రీగానే ఈ కార్డు పొందవచ్చు. పాత పాన్ కార్డులూ పనిచేస్తాయని, ఆ కార్డులో ఏమైనా తప్పులుంటే సరిచేసుకోవచ్చని కేంద్రం తెలిపింది.
News March 24, 2025
రోహిత్కు ఆరంభంలోనే దూకుడు పనికిరాదు: వాట్సన్

రోహిత్ శర్మ ఐపీఎల్లో కొంచెం ఆచితూచి ఆడాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డారు. ‘పిచ్పై ఓ ఐడియా వచ్చేవరకూ కనీసం 6 బంతుల పాటు రోహిత్ టైమ్ తీసుకోవాలి. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడటం అంత సులువు కాదు. చెన్నైతో మ్యాచ్లో పిచ్ నెమ్మదిగా ఉంది. అయినా షాట్ ఆడేందుకు యత్నించి ఆయన ఔట్ అయ్యారు. అన్ని సమయాల్లోనూ దూకుడు పనికిరాదు’ అని పేర్కొన్నారు.