News October 17, 2024
అనర్హుల ఏరివేత.. జనవరిలో కొత్త పెన్షన్లు!

AP: కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. నవంబరులో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అనర్హుల ఏరివేత కార్యక్రమం చేపట్టనుంది. అనర్హులకు నోటీసులిచ్చి తొలగించేందుకు 45 రోజుల సమయం తీసుకుంటారు. ఈ ప్రక్రియ విధివిధానాల కోసం 8 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటు కానుంది. జనవరిలో నిర్వహించే జన్మభూమి-2 ద్వారా కొత్తవారికి మంజూరు పత్రాలు అందించేలా ప్లాన్ చేస్తున్నారు.
Similar News
News October 28, 2025
మీరు వాడే పసుపు నాణ్యమైనదేనా? ఇలా చెక్ చేయండి

అన్ని రకాల వంటల్లో పసుపుదే కీలకపాత్ర. అయితే ఇటీవల కల్తీ పసుపు మార్కెట్లోకి వస్తోంది. దీన్ని గుర్తించడానికి కొన్ని చిట్కాలున్నాయి. ఒక గ్లాసు వెచ్చని నీళ్లలో చెంచా పసుపు వేసి 20ని. ఉంచాలి. స్వచ్ఛమైనదైతే గ్లాస్ అడుగుకు పసుపు చేరుతుంది. పైకి తేలితే కల్తీ. అలాగే చేతిపైన కొద్దిగా పసుపు వేసి కాసేపు నలపాలి. మృదువుగా అనిపించి రంగు మారకుంటే నాణ్యమైనది. గరుకుగా ఉండి రంగు మారితే నకిలీ.
News October 28, 2025
అవసరమైతే కేంద్రం సాయం కోరుతాం: CBN

AP: అందరూ సహాయక చర్యల్లో పాల్గొనాలని CM చంద్రబాబు కూటమి నేతలకు టెలీకాన్ఫరెన్స్లో పిలుపునిచ్చారు. ‘రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య తుఫాను తీరం దాటుతుంది. కృష్ణా, ప.గో, కోనసీమ, ఏలూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. ప్రాణనష్టం పూర్తిగా తగ్గించడం, ఆస్తినష్టం నివారించేలా చర్యలు చేపట్టాం. పిల్లలు, గర్భిణులు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలి. అవసరమైతే కేంద్రం సాయం కోరుతాం’ అని తెలిపారు.
News October 28, 2025
కళ్ల కింద డార్క్ సర్కిల్స్.. ఇలా మాయం

ఒత్తిడి, హార్మోన్ల ప్రభావం, నిద్రలేమి, మొబైల్, కంప్యూటర్ స్క్రీన్ ఎక్కువగా చూడటం వల్ల మహిళల్లో కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. ఈ సమస్యకు ఇంట్లోని పదార్థాలతోనే సహజంగా తగ్గించుకోవచ్చు. పచ్చి పాలు/బంగాళదుంప రసంలో దూదిని ముంచి కళ్ల కింద పెట్టి 20ని. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. రోజుకు 2సార్లు ఇలా చేయాలి. బంగాళదుంప/కీరా ముక్కను కళ్లకింద 10ని. రుద్ది నీటితో కడిగేసుకున్నా ప్రయోజనం ఉంటుంది.


