News March 4, 2025
భారత్ – ఆసీస్ మ్యాచ్కు కొత్త పిచ్

CT ఫస్ట్ సెమీఫైనల్లో రేపు భారత్, ఆసీస్ తలపడనున్నాయి. హైబ్రిడ్ విధానం వల్ల భారత్ తన మ్యాచ్లన్నీ దుబాయ్లోనే ఆడుతోంది. ఇది టీమ్ఇండియాకు కలిసొస్తోందని పలువురు మాజీ క్రికెటర్లు అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్కు కొత్త పిచ్ వినియోగిస్తున్నట్లు క్రిక్బజ్ వెల్లడించింది. AUSకు చెందిన క్యూరేటర్ మాథ్యూ శాండ్రీ ఆధ్వర్యంలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్(ECB) పిచ్ సిద్ధం చేసింది.
Similar News
News March 4, 2025
ICC నాకౌట్స్ అంటే హెడ్కు పూనకాలే!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య సెమీస్ జరగనుంది. ఇందులో ఆసీస్ విధ్వంసకర ప్లేయర్ ట్రావిస్ హెడ్ బరిలోకి దిగుతున్నారు. ఆయనకు ఐసీసీ టోర్నీల్లో ఘనమైన రికార్డు ఉంది. భారత్తో జరిగిన ODI WC సెమీస్లో 62, ఫైనల్లో 137, WTC ఫైనల్లో 163 బాదారు. ఈ మూడు మ్యాచుల్లోనూ ఆయన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నారు. ఇవాళ భారత్తో మ్యాచ్ కాబట్టి హెడ్ చెలరేగే ఆస్కారం ఉంది.
News March 4, 2025
ప్రభాస్ ‘ఫౌజీ’లో విలన్గా సన్నీ డియోల్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజీ’ మూవీపై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో విలన్గా బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుందని టాక్. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఇమాన్వి హీరోయిన్గా నటిస్తున్నారు. మరో హీరోయిన్గా సాయిపల్లవి నటిస్తారని సమాచారం. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
News March 4, 2025
అత్యంత పేదరిక జిల్లాగా కర్నూలు

AP: సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం రాష్ట్రంలోనే ఉమ్మడి కర్నూలు (42 శాతం) అత్యంత పేద జిల్లాగా నిలిచింది. అలాగే అతి తక్కువ పేదరికం ఉన్న జిల్లాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉంది. ఆ తర్వాత కడప, గుంటూరు, కృష్ణ జిల్లాలు నిలిచాయి. గిరిజనులు నివసించే అన్ని ప్రాంతాల్లో పేదరికం ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం ఉన్నాయి.