News November 17, 2024

రేపటి నుంచి కొత్త పాలసీ.. వాటికి ట్యాక్స్ ఫ్రీ

image

TG: వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు రాష్ట్రంలో ఈవీ(ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పాలసీ రేపటి(NOV 18) నుంచి 2026 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుందన్నారు. ఈ జీవో ప్రకారం ఈవీల్లో 4 వీలర్స్, టూవీలర్స్, కమర్షియల్ వెహికల్స్‌కు వందశాతం పన్ను మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. వీటితో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉంటుందని తెలిపారు.

Similar News

News December 1, 2025

NGKL: జిల్లాలో 8 గ్రామ పంచాయతీలకు సింగిల్ నామినేషన్

image

NGKL జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసిపోయింది. మొత్తం 151 గ్రామపంచాయతీలకు గాను 8 GPలకు సింగిల్ నామినేషన్ దాఖలు అయింది. దీంతో అక్కడ సర్పంచ్ స్థానం ఏకగ్రీవం కానుంది. వంగూరులోని కొండారెడ్డిపల్లి, వెల్దండ మండలంలో బండోని పల్లి, కేస్లీ తాండ, తెలకపల్లి మండలంలో తాళ్లపల్లి, గుట్ట రాయిపాకుల, ఊర్కొండ మండలంలో గుండ్లగుంటపల్లి గ్రామాలలో సింగిల్ నామినేషన్ వేశారు.

News December 1, 2025

హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం: CBN

image

AP: విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించే పనిలో ఉన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏలూరు(D) నల్లమాడులో పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన అక్కడి సభలో మాట్లాడారు. ‘94% స్ట్రైక్ రేట్‌తో గెలిపించారు. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం అమలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News December 1, 2025

‘హిల్ట్’పై గవర్నర్‌కు BJP ఫిర్యాదు

image

TG: ‘హిల్ట్’ పేరిట ప్రభుత్వం భూదందాకు పాల్పడుతోందని BJP గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. 9,292.53 ఎకరాల భూమిని మల్టీపర్పస్‌కు వినియోగించేలా తక్కువ ధరకే అప్పగిస్తోందని, దీనివెనుక ₹5లక్షల CR స్కామ్‌ ఉందని ఆరోపించింది. వెంటనే జోక్యం చేసుకొని భూములను పరిరక్షించాలంది. ‘హిల్ట్’ను రద్దు చేసి రిటైర్డ్ జడ్జితో విచారించాలని పార్టీ చీఫ్ రామచందర్‌రావు, LP నేత మహేశ్వర్ రెడ్డి గవర్నర్‌కు అందించిన వినతిలో కోరారు.