News October 22, 2024

కొత్త పీఆర్‌సీ సిఫార్సులు అమలు చేయాలి: ఉద్యోగుల జేఏసీ

image

TG: కొత్త పీఆర్‌సీ సిఫార్సులు అమలు చేయాలనే డిమాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ కార్యాచరణను ప్రకటించింది. ఈనెల 28న సీఎం, సీఎస్‌కు, నవంబర్ 2న కలెక్టర్లు, 4, 5 తేదీల్లో ప్రజాప్రతినిధులకు కార్యాచరణ లేఖలు ఇవ్వనుంది. నవంబర్ 7 నుంచి డిసెంబర్ 27 వరకు ఉమ్మడి జిల్లాల వారీగా సదస్సులు, వచ్చే ఏడాది జనవరి 3, 4 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసనలు, JAN 23న బైక్ ర్యాలీలు, 30న మానవహారాలు నిర్వహించనుంది.

Similar News

News September 16, 2025

బందీలను వదిలేయండి.. హమాస్‌కు ట్రంప్ వార్నింగ్

image

హమాస్ నాయకులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొనేందుకు బందీలను మానవ కవచాలుగా వాడేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. హమాస్ నేతలు ఏం చేస్తున్నారో వారికి అర్థమవుతోందా? ఇది మహా దారుణం. అతి తక్కువ మంది అలాంటివి చూసుంటారు. అలా జరగకుండా ఆపండి. లేదంటే అన్నీ ఒప్పందాలు రద్దవుతాయి. బందీలను వెంటనే విడుదల చేయండి’ అని వార్నింగ్ ఇచ్చారు.

News September 16, 2025

మద్యంమత్తులో లారీ డ్రైవర్ బీభత్సం

image

MPలోని ఇండోర్‌లో ఓ లారీ డ్రైవర్ మద్యం తాగి వాహనంతో బీభత్సం సృష్టించాడు. వాహనాలనే కాకుండా రోడ్డు పక్కనే నడుస్తున్న ప్రజలను కూడా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పలువురికి గాయాలయ్యాయి. బైకులను ఢీకొట్టి వాటిని రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు. ఓ బైకును లాక్కెళ్లడంతో దాని ట్యాంక్ పేలి లారీ మొత్తం తగలబడిపోయింది. డ్రైవర్ ఫుల్‌గా తాగేసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదైంది.

News September 16, 2025

ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు మరో రోజు పొడిగింపు

image

AY 2025-26కు గానూ ITR ఫైలింగ్ గడువును ఆదాయ పన్ను శాఖ మరోసారి పెంచింది. జులై 31నే ఈ గడువు ముగియాల్సింది. దానిని SEP 15కు పొడిగించింది. ఇప్పుడు మరొక్క రోజు(సెప్టెంబర్ 16 వరకు) పెంచింది. ట్యాక్స్ ఫైలింగ్ పోర్టల్‌లో టెక్నికల్ గ్లిట్చ్ కారణంగా ఫైలింగ్‌కు చాలామంది ఇబ్బందులు పడినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే గడువును పొడిగించినట్లు తెలస్తోంది. గడువులోగా ఫైలింగ్ పూర్తి చేయాలని అధికారులు సూచించారు.