News July 5, 2024

బ్రిటన్‌కు కొత్త ప్రధాని.. భారత్‌తో బంధం కొనసాగేనా?(2/2)

image

కశ్మీర్‌పై లేబర్ పార్టీ నేత జెరెమీ తీర్మానంతో డ్యామేజీ కలిగిందని తెలుసుకున్న PM అభ్యర్థి స్టార్మర్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కశ్మీర్ అంశం భారత్ అంతర్గత సమస్య అని చెప్పారు. INDతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. దీపావళి, హోళీ వంటి హిందూ వేడుకల్లోనూ పాల్గొన్నారు. దీన్నిబట్టి ఆయన INDతో మంచి బంధాన్ని కొనసాగిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు.

Similar News

News November 19, 2025

USలో ఏపీ మహిళ హత్య.. బిగ్ ట్విస్ట్

image

APకి చెందిన శశికళ(40), కుమారుడు అనీష్(7) 2017లో USలో హత్యకు గురయ్యారు. భర్తపై అనుమానంతో పోలీసులు అరెస్టుచేసి ఆధారాల్లేక విడిచిపెట్టారు. వారికి హమీద్‌ అనే సహోద్యోగితో గొడవలున్నాయని గుర్తించగా, అప్పటికే అతను INDకు వచ్చేశాడు. అధికారులు DNA శాంపిల్స్ కోరగా తిరస్కరించాడు. అతను పనిచేసిన Cognizant సాయంతో హమీద్ Laptop నుంచి సేకరించిన DNA హత్యాస్థలంతో సరిపోలింది. దీంతో ఇటీవల హమీద్‌ను నిందితుడిగా తేల్చారు.

News November 19, 2025

సినిమా అప్డేట్స్

image

* విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో నితిన్ ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రంలో నటిస్తారని సమాచారం. వీరి కాంబోలో వచ్చిన ‘ఇష్క్’ సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే.
* సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ చిత్రంలో నటిస్తారని టాక్. ఇందులో మిలిటరీ ఆఫీసర్ పాత్రలో పవర్ స్టార్ కనిపిస్తారని సమాచారం.
* జూనియర్ ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమా తర్వాతి షెడ్యూల్ డిసెంబర్‌లో శ్రీలంకలో జరుగుతుందని సినీ వర్గాలు వెల్లడించాయి.

News November 19, 2025

హసీనాకు మరణశిక్ష.. కుమారుడి స్పందనిదే..

image

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు <<18311087>>మరణశిక్ష<<>> విధిస్తూ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ తీసుకున్న నిర్ణయంపై ఆమె కుమారుడు సాజిబ్ వాజీద్ స్పందించారు. కేసుల విచారణలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం న్యాయ ప్రక్రియను పాటించలేదని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ మార్పుకు జో బైడెన్ సర్కారు మిలియన్ డాలర్లు వెచ్చించిందని విమర్శించారు. అయితే, ట్రంప్ ప్రభుత్వ వైఖరి వేరుగా ఉందని సాజిబ్ అభిప్రాయపడ్డారు.