News October 31, 2024

2 నుంచి ఏపీలో కొత్త కార్యక్రమం

image

AP: రాష్ట్రంలో వచ్చే నెల 2 నుంచి ‘మిషన్ పాట్‌హోల్ ఫ్రీ ఏపీ’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆరంభిస్తోంది. సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా ఎస్‌.కోటలో రోడ్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో రోడ్లకు ఇరువైపులా కంపచెట్ల తొలగింపు, గుంతలు పూడ్చడం, కల్వర్టుల నిర్మాణం వంటి పనులు చేపడతారు. ఇందుకోసం రూ.860 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. జనవరి నాటికి పనులు పూర్తిచేయాలని ఆదేశించింది.

Similar News

News December 6, 2025

త్వరలో అఖండ-2 మూవీ కొత్త రిలీజ్ డేట్

image

బాలకృష్ణ-బోయపాటి కాంబోలో తెరకెక్కిన <<18465729>>అఖండ-2<<>> చిత్రం రిలీజ్ ఆలస్యమైన విషయం తెలిసిందే. రేపైనా సినిమా విడుదలవుతుందని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అయితే మూవీ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. ‘సినిమాని విడుదల చేసేందుకు చాలా కష్టపడ్డాం. కానీ సాధ్యం కాలేదు. ఫ్యాన్స్, మూవీ లవర్స్‌ మమ్మల్ని క్షమించాలి. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’ అని ట్వీట్ చేసింది.

News December 6, 2025

గ్లోబల్‌ సమ్మిట్‌ పూర్తిగా ఆర్థిక సదస్సు: CM

image

TG: భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ పూర్తిగా ఆర్థిక సదస్సని సమీక్షలో CM రేవంత్ పేర్కొన్నారు. ఏర్పాట్లు, ప్రోగ్రాం షెడ్యూల్‌‌ను అధికారులు వివరించారు. దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌‌లో ఈ గ్లోబల్ సమ్మిట్ విజయాన్ని ప్రదర్శించాలన్న ఆలోచనను CM వివరించారు. భవిష్యత్‌ వృద్ధి ప్రణాళికలను ప్రధానంగా చేర్చాలని, ఈ పత్రాన్ని ప్రజలకు డిజిటల్‌గా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

News December 6, 2025

భారత్‌లో మరో రష్యన్ న్యూక్లియర్ ప్లాంట్!

image

రష్యా తయారుచేసిన రియాక్టర్లతో భారత్‌లో రెండో అణు విద్యుత్ ప్లాంట్ నిర్మించే అవకాశాలపై చర్చించినట్టు రెండు దేశాలు ప్రకటించాయి. ఈ ప్రాజెక్టుకు స్థలాన్ని కేటాయించేందుకు భారత్ కట్టుబడి ఉందని తెలిపాయి. ప్రైవేట్ న్యూక్లియర్ ఆపరేటర్లకు అవకాశం ఇచ్చే సంస్కరణలపై చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఇప్పటికే తమిళనాడు కూడంకుళంలో ఒక గిగావాట్ సామర్థ్యం కలిగిన 2 రష్యన్‌ VVERలను భారత్ నిర్వహిస్తోంది.