News December 17, 2024
కులగణన డేటా ఆధారంగానే కొత్త రేషన్ కార్డులు!

TG: సంక్రాంతి నుంచి కొత్త రేషన్ స్మార్ట్ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ ఇప్పటికే ప్రకటించారు. అర్హుల ఎంపికకు ఇటీవల నిర్వహించిన కులగణన డేటాను పరిశీలిస్తామని చెప్పారు. కొత్తగా 10 లక్షల కార్డులు ఇస్తామని చెప్పిన ఆయన, వీటి వల్ల 36 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. కొత్త కార్డులు, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడానికి చేసుకున్న 18 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు మంత్రి తెలిపారు.
Similar News
News December 7, 2025
మీ ఇంట్లో ఏడు గుర్రాల చిత్ర పటం ఉందా?

పరిగెడుతున్న 7 గుర్రాల చిత్రాన్ని ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఉత్తర దిశలో ఉంచితే సిరి సంపదలకు లోటుండదని, దక్షిణ దిశలో ఉంచితే చేసే పనుల్లో విజయం లభిస్తుందని అంటున్నారు. ‘ఈ చిత్రం శ్రేయస్సు, విజయాన్ని సూచిస్తుంది. దీన్ని పూజా మందిరంలోనే పెట్టాల్సిన అవసరం లేదు. సూర్య భగవానుడి వాహనం అయిన రథాన్ని ఈ తెలుపు గుర్రాలే లాగుతాయి’ అని వివరిస్తున్నారు.
News December 7, 2025
అర్ధరాత్రి తినే అలవాటు ఎంత ప్రమాదమంటే?

అర్ధరాత్రి తినే అలవాటు మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘లేట్ నైట్ తినే అలవాటు మీ నిద్ర, జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. రాత్రి సమయంలో మీ శరీరం ఫ్యాట్ని బర్న్ చేస్తుంది. కానీ, మీరు తినడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. అప్పుడు ఫ్యాట్ బర్నింగ్ మోడ్ కాస్తా స్టోరేజ్ మోడ్కు వెళ్తుంది. దాంతో మీ శరీరం బరువు పెరుగుతుంది. అధిక బరువు అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది’ అని చెబుతున్నారు.
News December 7, 2025
న్యాయం చేయండి.. మోదీకి పాక్ మహిళ అభ్యర్థన

తనకు న్యాయం చేయాలని ప్రధాని మోదీని పాకిస్థాన్ మహిళ కోరారు. తన భర్త విక్రమ్ నాగ్దేవ్ కరాచీ నుంచి లాంగ్ టర్మ్ వీసాపై ఇండోర్(MP) వచ్చి అక్కడే ఉంటున్నాడని పేర్కొన్నారు. అతను ఢిల్లీకి చెందిన మరో యువతితో పెళ్లికి సిద్ధమైనట్టు తెలిసిందని చెప్పారు. జనవరిలో కేసు ఫైల్ చేసినా లీగల్గా న్యాయం జరగలేదన్నారు. ప్రధాని మోదీ న్యాయం చేయాలంటూ అభ్యర్థించిన వీడియో వైరలవుతోంది. దీనిపై లీగల్ బాడీస్ మండిపడుతున్నాయి.


