News August 24, 2024
చక్కెర ఉత్పత్తిపై కొత్త నిబంధనలు

చక్కెర ఉత్పత్తి, నిల్వ, ధరలకు సంబంధించి దాదాపు 6 దశాబ్దాల నాటి నిబంధనలను సాంకేతిక పురోగతికి అనుగుణంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీని కోసం ‘ది షుగర్ (నియంత్రణ) ఆర్డర్- 2024’ ముసాయిదాను విడుదల చేసింది. ముసాయిదా బిల్లు చట్టరూపం దాల్చితే ఉత్పత్తిదారునికి లైసెన్స్ ఉంటే తప్పా చెరకు నుంచి చక్కెర, దాని బై ప్రోడక్ట్స్ తయారు చేయరాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు ఇవ్వగలవు.
Similar News
News November 12, 2025
600 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News November 12, 2025
భారీ ‘ఉగ్ర కుట్ర’.. సంచలన విషయాలు

ఢిల్లీలోని ఎర్రకోట మెట్రోస్టేషన్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జనవరి 26 గణతంత్ర దినోత్సవం, దీపావళి రోజున భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర చేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇందుకోసం ఉమర్ నబీ, ఉమర్ మహ్మద్ పలుమార్లు ఎర్రకోట వద్ద రెక్కీ చేసినట్లు సమాచారం. కాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు 9 మందిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.
News November 12, 2025
కర్రపెండలంలో మెగ్నీషియం లోప లక్షణాలు

కర్రపెండలం మొక్కలో మెగ్నీషియం లోపం వల్ల ఆకు ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది. తీవ్రత ఎక్కువగా ఉంటే పసుపు రంగులోకి మారిన ఆకు భాగాల కణాలు మృతి చెంది గోధుమ రంగులోకి లేదా తెలుపు రంగులోకి మారిపోతాయి. నేలలో పొటాషియం ఎక్కువగా ఉన్నా కూడా మొక్కలలో మెగ్నిషియం లోపం కనిపిస్తుంది. నివారణకు ఎకరాకు 8 కేజీల మెగ్నీషియం సల్ఫేట్ భూమిలో వేసి కప్పాలి. 1% మెగ్నీషియం సల్ఫేట్ మొక్కలపై పిచికారీ చేయాలి.


