News January 17, 2025
కొత్త రూల్.. ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటేనే..

సైబర్ మోసాలు పెరుగుతుండటంతో కొత్త సిమ్ కార్డుల జారీపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ కచ్చితమని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఓటర్ ఐడీ, పాస్పోర్ట్ తదితర ప్రభుత్వ ఐడీలు ఉంటే కొత్త సిమ్ ఇచ్చేవారు. కానీ తాజా నిబంధన ప్రకారం ఇక నుంచి ఆధార్ వెరిఫై చేయించాల్సిందే. అంటే ఆధార్ లేనిదే సిమ్ కార్డు ఇవ్వరు.
SHARE IT
Similar News
News December 11, 2025
గుడికి ఎందుకు వెళ్లాలి?

ఆలయ ప్రాంగణంలో సానుకూల శక్తి ఉంటుంది. గర్భగుడి చుట్టూ ఉండే శక్తిమంతమైన తరంగాలు మనలోని నెగటివ్ ఎనర్జీని తొలగిస్తాయి. గంట చప్పుడు, హారతి, పూల పరిమళం, చెప్పులు లేకుండా నడవడం, కుంకుమ ధరించడం.. ఈ ప్రక్రియలు మన పంచేంద్రియాలను జాగృతం చేస్తాయి. ఏకాగ్రతను పెంచుతాయి. తీర్థంలోని తులసి, రాగి శారీరక సమస్యలను దూరం చేస్తాయి. ప్రశాంతత, ఆరోగ్యం కోసం ఆలయాలకు వెళ్లాలి. మరింత సమాచారం కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News December 11, 2025
చలికాలం.. పాడి పశువుల సంరక్షణ (1/2)

రాత్రి వేళ చలి తీవ్రత ఎక్కువగా ఉంటే పశువుల షెడ్లలో కరెంటు బల్బులను ఏర్పాటు చేసి వెలుతురు, వేడిని అందించాలి. రాత్రివేళ పశువులను ఉంచే పాకలు, కొట్టాలు, షెడ్ల చుట్టూ గోనెసంచులతో లేదా తడికెలతో కప్పి ఉంచాలి. తడిగా, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలను ఉంచకూడదు. పశువులకు గోరువెచ్చని నీటిని అందించాలి. చలికాలానికి సంబంధించి పశువులకు వెటర్నరీ వైద్యులు సూచించిన మేతను అందించాలి.
News December 11, 2025
గుడికి వెళ్లినప్పుడు ఇలా చేయండి..

గర్భగుడిలో దర్శనం చేసుకునేటప్పుడు కళ్లు మూసుకుని ప్రార్థించాలి. హారతి సమర్పించే సమయంలో కళ్లు తెరవాలి. దీనివల్ల చీకటిలో వెలిగే కర్పూరం వెలుగు కళ్లను ఉత్తేజపరుస్తుంది. హారతిని కళ్లకు అద్దుకున్నప్పుడు ఆ వెచ్చదనం చేతులకు తగులుతుంది. ఆ చేతులను తిరిగి కళ్లపై ఉంచుకున్నప్పుడు స్పర్శా శక్తి జాగృతమవుతుంది. ఈ ప్రక్రియ వల్ల మన ఏకాగ్రత పెరుగుతుంది. ఆలయ దర్శనంలో ఈ దివ్యానుభూతి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.


