News January 17, 2025

కొత్త రూల్.. ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటేనే..

image

సైబర్ మోసాలు పెరుగుతుండటంతో కొత్త సిమ్ కార్డుల జారీపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ కచ్చితమని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ తదితర ప్రభుత్వ ఐడీలు ఉంటే కొత్త సిమ్ ఇచ్చేవారు. కానీ తాజా నిబంధన ప్రకారం ఇక నుంచి ఆధార్ వెరిఫై చేయించాల్సిందే. అంటే ఆధార్ లేనిదే సిమ్ కార్డు ఇవ్వరు.
SHARE IT

Similar News

News December 22, 2025

పోలవరానికి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలి: పవన్

image

AP: అమరజీవి పొట్టి శ్రీరాములుకు గౌరవం ఇవ్వాలంటే పోలవరం ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని Dy.CM పవన్ అభిప్రాయపడ్డారు. తన ఆలోచనపై అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలన్నారు. మహనీయుడు అంబేడ్కర్‌కు కూడా కులం ఆపాదించడం సరికాదన్నారు. ‘పదవి-బాధ్యత’ సమావేశంలో ఆయన మాట్లాడారు.

News December 22, 2025

ఐడియాలజీ సరైంది కాకుంటే ఇబ్బందులు: పవన్

image

AP: జనసేన కోసం పనిచేసిన వారందరినీ గుర్తించామని పార్టీ చీఫ్, Dy.CM పవన్ చెప్పారు. నామినేటెడ్ పదవులు పొందినవారితో మంగళగిరిలో మాట్లాడారు. ‘ఓడిపోయినా నిలబడినందుకే మీకు పదవులు వచ్చాయి. మీరంతా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. యువతకు సరైన వేదికగా నేను పార్టీ పెట్టా. అప్పట్లో కొత్త పంథాను నమ్ముకుని మావోలుగా మారి వేలాదిమంది చనిపోయారు. ఐడియాలజీ సరైంది కాకుంటే ఇలాంటి ఇబ్బందులొస్తాయి’ అని తెలిపారు.

News December 22, 2025

బంగ్లాదేశ్‌లో హిందువుల జనాభా ఎంతంటే?

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై ఈ మధ్య దాడులు పెరిగాయి. ఇటీవల దీపూ చంద్రదాస్ హత్యతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. భారత ప్రభుత్వం సైతం దీన్ని నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ హిందువుల జనాభా ఎంతనే చర్చ జరుగుతోంది. బంగ్లా 2022 సెన్సస్ ప్రకారం ఆ దేశంలో దాదాపు 1.3 కోట్ల మంది హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు. ఇది ఆ దేశ మొత్తం జనాభాలో 8%. భారత్, నేపాల్ తర్వాత అత్యధిక మంది హిందువులున్నది బంగ్లాలోనే.