News January 17, 2025

కొత్త రూల్.. ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటేనే..

image

సైబర్ మోసాలు పెరుగుతుండటంతో కొత్త సిమ్ కార్డుల జారీపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ కచ్చితమని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ తదితర ప్రభుత్వ ఐడీలు ఉంటే కొత్త సిమ్ ఇచ్చేవారు. కానీ తాజా నిబంధన ప్రకారం ఇక నుంచి ఆధార్ వెరిఫై చేయించాల్సిందే. అంటే ఆధార్ లేనిదే సిమ్ కార్డు ఇవ్వరు.
SHARE IT

Similar News

News November 27, 2025

కోదాడ: హోరా హోరీగా జాతీయ స్థాయి క్రీడలు

image

కోదాడ సీసీ రెడ్డి పాఠశాలలో 19వ సీఎస్ఏ జాతీయ స్థాయి క్రీడా పోటీలు గురువారం రెండో రోజు ఉత్సాహంగా కొనసాగాయి. ప్రిన్సిపల్ ఆన్ జ్యోతి పర్యవేక్షణలో కన్వీనర్ సిస్టర్ ఉడుముల శౌరీలు, సిస్టర్ నక్షత్రం క్రీడలను ప్రారంభించారు. వాలీబాల్, బాస్కెట్‌బాల్, ఖోఖో, కబడ్డీ, త్రోబాల్, అథ్లెటిక్స్‌లో విద్యార్థులు ప్రతిభ చూపించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులతో పండుగ వాతావరణం నెలకొంది.

News November 27, 2025

తొలిరోజు నామినేషన్లు ఎన్నో తెలుసా?

image

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తొలిరోజు 3,242 సర్పంచ్, 1,821 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడతలో ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న వాటిని పరిశీలిస్తారు. డిసెంబర్ 3 వరకు విత్‌డ్రాకు అవకాశం ఉంటుంది. తొలి దశలో 4,236 గ్రామాలకు, 37,440 వార్డులకు పోలింగ్ జరగనుంది. కాగా తొలి విడత పోలింగ్ డిసెంబర్ 11న నిర్వహించనున్నారు.

News November 27, 2025

తొలిరోజు నామినేషన్లు ఎన్నో తెలుసా?

image

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తొలిరోజు 3,242 సర్పంచ్, 1,821 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడతలో ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న వాటిని పరిశీలిస్తారు. డిసెంబర్ 3 వరకు విత్‌డ్రాకు అవకాశం ఉంటుంది. తొలి దశలో 4,236 గ్రామాలకు, 37,440 వార్డులకు పోలింగ్ జరగనుంది. కాగా తొలి విడత పోలింగ్ డిసెంబర్ 11న నిర్వహించనున్నారు.