News January 17, 2025
కొత్త రూల్.. ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటేనే..

సైబర్ మోసాలు పెరుగుతుండటంతో కొత్త సిమ్ కార్డుల జారీపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ కచ్చితమని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఓటర్ ఐడీ, పాస్పోర్ట్ తదితర ప్రభుత్వ ఐడీలు ఉంటే కొత్త సిమ్ ఇచ్చేవారు. కానీ తాజా నిబంధన ప్రకారం ఇక నుంచి ఆధార్ వెరిఫై చేయించాల్సిందే. అంటే ఆధార్ లేనిదే సిమ్ కార్డు ఇవ్వరు.
SHARE IT
Similar News
News December 11, 2025
చెరువుల్లో నీటి నాణ్యత – చేపలపై ప్రభావం

చెరువుల్లో నీరు ఎంత నాణ్యంగా ఉంటే చేపలు అంత ఆరోగ్యంగా, వేగంగా పెరుగుతాయి. నీటి నాణ్యత చెడిపోతే చేపల్లో ఒత్తిడి, వ్యాధులు, మరణాలు సంభవిస్తాయి. చేపలు ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం లీటరు నీటికి 5 మి.గ్రా. DO(డిసాల్వ్ ఆక్సిజన్) ఉండాలి. ఇది 3 మి.గ్రా. కంటే తక్కువైతే చేపలు బలహీనపడతాయి, 1 మి.గ్రా. కన్నా తక్కువైతే చేపలు చనిపోవచ్చు. తెల్లవారుజామున, మబ్బు వాతావరణం, వర్షపు రోజుల్లో డిఓ తక్కువగా ఉంటుంది.
News December 11, 2025
మొదలైన కౌంటింగ్.. గెలుపెవరిది.. తెలుసుకోండి

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. ముందుగా వార్డు మెంబర్స్ అభ్యర్థుల ఓట్లు కట్టలు కట్టి లెక్కిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు, ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటాయి. ఊర్లలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకునే ఈ ఎన్నికకు భారీ బందోబస్తు కల్పిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. Way2Newsలో మీ లొకేషన్పై క్లిక్ చేసి ఊరు, వార్డు వారీగా కౌంటింగ్ అప్డేట్స్ ఎక్స్క్లూజివ్గా పొందండి.
News December 11, 2025
ఇంకెన్నాళ్లు.. అప్డేట్ అవ్వండి!

ప్రభుత్వ వెబ్సైట్లలో దరఖాస్తు పత్రాలు(200KB), ఫొటోలు (100KB), సిగ్నేచర్ (50KB) వంటి అప్లోడ్కు సైజు పరిమితులు ఉండటంపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నెట్ వేగం తక్కువగా ఉండేదని.. నేటి హైస్పీడ్ నెట్ యుగంలో నాణ్యత తగ్గించడానికి ఇతర యాప్స్ వాడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఫైల్ అప్లోడ్ చేశాక సర్వరే దాని పరిమాణాన్ని తగ్గించుకునేలా మార్పులు తీసుకురావాలని కోరుతున్నారు. దీనిపై మీకామెంట్?


