News January 17, 2025

కొత్త రూల్.. ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటేనే..

image

సైబర్ మోసాలు పెరుగుతుండటంతో కొత్త సిమ్ కార్డుల జారీపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ కచ్చితమని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ తదితర ప్రభుత్వ ఐడీలు ఉంటే కొత్త సిమ్ ఇచ్చేవారు. కానీ తాజా నిబంధన ప్రకారం ఇక నుంచి ఆధార్ వెరిఫై చేయించాల్సిందే. అంటే ఆధార్ లేనిదే సిమ్ కార్డు ఇవ్వరు.
SHARE IT

Similar News

News December 8, 2025

BREAKING: సెలవుల జాబితా విడుదల

image

TG: 2026కు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకుల సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కు 27 సాధారణ సెలవులు, 26 ఆప్షనల్ సెలవులను కేటాయించింది. బ్యాంకులకు 23 సెలవులను ఇచ్చింది. హాలిడేస్ లిస్టు కోసం పైన ఫొటోను స్లైడ్ చేసి చూడండి. కాగా ఇటీవల ఏపీ ప్రభుత్వం కూడా <<18470577>>సెలవుల జాబితాను<<>> రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

News December 8, 2025

ఫ్యూచర్ సిటీలో జూపార్క్.. ‘వనతారా’తో కుదిరిన ఒప్పందం

image

TG: అంబానీ కుటుంబం నిర్వహిస్తున్న ‘వనతారా’ నేషనల్ జూపార్క్ ఫ్యూచర్‌ సిటీలోనూ ఏర్పాటు కానుంది. గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ ప్రభుత్వంతో వనతారా బృందం ఎంవోయూ కుదుర్చుకుంది. వనతారా నేషనల్ జూ పార్క్ ప్రస్తుతం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉంది. ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ దీని నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. వందలాది వన్యప్రాణులను ఇక్కడ సంరక్షిస్తుండగా గతంలో PM మోదీ దీన్ని సందర్శించారు.

News December 8, 2025

ఆధార్ దుర్వినియోగాన్ని ఇలా తెలుసుకోండి!

image

సైబర్ మోసాలను అరికట్టేందుకు తరచూ ఆధార్ అథెంటికేషన్ హిస్టరీని చెక్ చేసుకోవాలని ‘UIDAI’ సూచించింది. దీనిద్వారా మీ ఆధార్‌ను ఎక్కడ వాడారో, ఇంకెవరైనా వాడుతున్నారో చెక్ చేసుకోవచ్చని తెలిపింది. దీనికోసం తొలుత My Aadhaar పోర్టల్‌ను సందర్శించాలి. ఆధార్ నంబర్‌తో లాగిన్ అయి ‘authentication history’ని <>క్లిక్<<>> చేయాలి. గత 6 నెలల్లో ఆధార్‌ను ఎక్కడెక్కడ వాడారు, దుర్వినియోగం అయ్యిందా అనేది తెలుసుకోవచ్చు. SHARE IT