News March 21, 2024
IPL-2024లో కొత్త రూల్

IPL-2024లో ఈసారి ఓవర్కు రెండు షార్ట్ బాల్స్(బౌన్సర్)ను అనుమతించనున్నారు. గత సీజన్ వరకు ఓవర్కు ఒక బౌన్సర్ మాత్రమే వేయాలనే రూల్ ఉండేది. అలాగే స్టంపింగ్ కోసం థర్డ్ అంపైర్కు రెఫర్ చేసినప్పుడు ముందుగా క్యాచ్ను చెక్ చేసే రూల్ను కొనసాగించనున్నారు. ఔట్, నాటౌట్తో పాటు వైడ్, నో బాల్ కోసం ఒక్కో టీమ్కు రెండు రివ్యూలను కంటిన్యూ చేయనున్నారు. ఇటీవల ICC తీసుకొచ్చిన స్టాప్ క్లాక్ రూల్ను అమలు చేయడం లేదు.
Similar News
News April 14, 2025
రక్తమోడిన రోడ్లు.. ఎనిమిది మంది మృతి

AP: కడప(D) ఒంటిమిట్ట(M) నడింపల్లి వద్ద బస్సు-బొలెరో ఢీకొన్న ఘటనలో జీపులోని ముగ్గురు, నెల్లూరు(D) రాపూరులోని తిక్కనవాటిక పార్కు వద్ద కారు ఢీకొట్టడంతో వడ్లు ఎండబెట్టుకుంటున్న ఇద్దరు రైతులు చనిపోయారు. TG జనగామ(D) రాఘవపూర్ వద్ద లారీని కారు ఢీకొట్టడంతో కారు డ్రైవర్ సహా ఇద్దరు మహిళలు చనిపోయారు. అటు RR(D) దామరగిద్ద వద్ద కారు డోర్లు లాక్ పడటంతో అందులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఊపిరాడక చనిపోయారు.
News April 14, 2025
వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్

AP: వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. మైనార్టీలకు వ్యతిరేకంగా కేంద్రం ఈ చట్టం రూపొందించిందని పిటిషన్లో పేర్కొంది. పార్లమెంట్లో కూడా ఆ పార్టీ బిల్లును వ్యతిరేకించింది.. కాగా మైనార్టీ సమాజానికి వైసీపీ అండగా ఉంటుందని జగన్ ఇటీవల హామీ ఇచ్చారు.
News April 14, 2025
DCvsMI: అక్షర్ పటేల్కు రూ.12 లక్షల ఫైన్

IPL: ముంబై చేతిలో ఓటమితో బాధలో ఉన్న ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా BCCI రూ.12 లక్షల ఫైన్ విధించింది. ఈ సీజన్లో జరిమానా పడిన ఆరో కెప్టెన్గా నిలిచారు. ఈ జాబితాలో పరాగ్, శాంసన్(RR), పాండ్య(MI), పంత్(LSG), పాటీదార్(RCB) ఉన్నారు. కాగా 3సార్లు స్లో ఓవర్ రేట్ మెయింటేన్ చేస్తే కెప్టెన్పై ఓ మ్యాచ్ బ్యాన్ విధించే నిబంధనను బీసీసీఐ తొలగించిన విషయం తెలిసిందే.