News February 27, 2025
కొత్త రూల్.. వాహనాలకు లొకేషన్ ట్రేసింగ్ డివైజ్లు మస్ట్!

TG: ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా వాహనాలకు లొకేషన్ ట్రేసింగ్ డివైజ్లను తప్పనిసరిగా అమర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయాణికుల భద్రత కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, గూడ్స్ వెహికల్స్కు (కొత్త, పాత) ఈ రూల్ను తేనుంది. దీనిపై అనుమతి కోసం కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం అనుమతిస్తే దేశంలోనే తొలిసారిగా TGలో ఇది అమలు కానుంది. ఈ రూల్ను పాటించకపోతే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తారు.
Similar News
News December 13, 2025
నిద్రలో పళ్లుకొరుకుతున్నారా?

నిద్రలో కొందరు పళ్లను కొరుకుతుంటారు. దీన్ని బ్రక్సిజం అంటారు. ఎక్కువ ఆందోళన, ఒత్తిడి, కోపం, నిరాశ, ఉద్రిక్తత ఎక్కువగా ఉంటే నిద్రలో ఇలా పళ్లు కొరుకుతారని నిపుణులు చెబుతున్నారు. అయితే చిన్నారుల్లో పేగుల్లో పురుగులు ఉన్నా, కాల్షియం, మెగ్నీషియం లోపాలు ఉన్నా వారు నిద్రలో పళ్లను కొరుకుతారని అంటున్నారు. అందుకే చిన్నారులకు పోషకాహారం ఇస్తే ఈ సమస్య నుంచి బయట పడవచ్చని చెబుతున్నారు.
News December 13, 2025
ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఒక్కరోజే 16 మంది మృతి

AP: రాష్ట్రంలో రహదారులు రక్తసిక్తమయ్యాయి. నిన్న 4 రోడ్డు ప్రమాదాల్లో 16 మంది చనిపోయారు. అల్లూరి జిల్లాలో జరిగిన యాక్సిడెంట్లో 9 మంది మరణించారు. బాపట్ల(D) దోనేపూడిలో వాహనం వేగంగా దూసుకెళ్లి కాల్వలో కూరుకుపోవడంతో ముగ్గురు మృతి చెందారు. అదే జిల్లా చందోలులో రెండు బైక్లు ఢీకొని ఇద్దరు చనిపోయారు. నంద్యాల(D) ఆళ్లగడ్డలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించారు.
News December 13, 2025
కూష్మాండ దీపాన్ని ఎలా వెలిగించాలి?

ఓ చిన్న బూడిద గుమ్మడికాయ తీసుకోవాలి. దాన్ని అడ్డంగా కోయాలి. లోపల ఉండే గింజలన్నీ తీసి డొల్లగా చేయాలి. పసుపు, కుంకుమ పెట్టి అందులో నల్ల నువ్వుల నూనె పోయాలి. 2 పెద్ద వత్తులతో దీపం వెలిగించాలి. అనంతరం పంచోపచార పూజ చేయాలి. కాల భైరవ అష్టకాన్ని 11 సార్లు చదవాలి. సాయంత్రం వరకు ఉపవాసం ఉండటం ఉత్తమం. ఘన పదార్థాలను తినకూడదు. 4:30 AM – 6:00 AM మద్యలో ఈ పూజ చేస్తే ఉత్తమ ఫలితాలుంటాయి.


