News February 27, 2025
కొత్త రూల్.. వాహనాలకు లొకేషన్ ట్రేసింగ్ డివైజ్లు మస్ట్!

TG: ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా వాహనాలకు లొకేషన్ ట్రేసింగ్ డివైజ్లను తప్పనిసరిగా అమర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయాణికుల భద్రత కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, గూడ్స్ వెహికల్స్కు (కొత్త, పాత) ఈ రూల్ను తేనుంది. దీనిపై అనుమతి కోసం కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం అనుమతిస్తే దేశంలోనే తొలిసారిగా TGలో ఇది అమలు కానుంది. ఈ రూల్ను పాటించకపోతే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తారు.
Similar News
News October 17, 2025
ఇన్స్టాలో దీపావళి ఎఫెక్ట్ ట్రై చేశారా?

దీపావళి కోసం మెటా సంస్థ ఇన్స్టాలో కొత్త ఎఫెక్ట్స్ తీసుకొచ్చింది. వాటిని ట్రై చేసేందుకు ఇన్స్టా ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ దగ్గర ‘+’ క్లిక్ చేయండి. మీకు కావాల్సిన ఫొటోని సెలక్ట్ చేసుకోండి. పైన ఉండే బ్రష్ ఐకాన్ క్లిక్ చేయండి. బోటమ్లో ఫైర్ వర్క్స్, దియాస్ అని ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో మీకు నచ్చింది సెలక్ట్ చేసుకుంటే AI ఆటోమేటిక్గా ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. మీకు నచ్చితే డన్ కొట్టి పోస్ట్ చేసుకోవచ్చు.
News October 17, 2025
చతుర్వేదాల ఆవిర్భావం ఎలా జరిగిందంటే?

వేదాలు అపౌరుషేయాలు. అంటే వాటిని మనుషులు రచించలేదని అర్థం. పరమాత్మే మన కోసం వర ప్రసాదాలుగా అందించాడు. సృష్టి ఆరంభంలో గాయత్రి వంటి ఛందస్సుతో 4 వేదాలను ప్రకటించాడు. అగ్ని ద్వారా ఋగ్వేదాన్ని, వాయువు ద్వారా యజుర్వేదాన్ని, సూర్యుని ద్వారా సామవేదాన్ని, అంగీరసుని ద్వారా అధర్వణ వేదాన్ని అందించాడు. ఈ నలుగురి ద్వారానే ఈ వేదజ్ఞానం మహర్షులకు లభించింది. వారి నుంచే ఆ జ్ఞానాన్ని మనం పొందుతున్నాం. <<-se>>#VedikVibes<<>>
News October 17, 2025
నేడు విద్యుత్ ఉద్యోగులతో మరోసారి చర్చలు

AP: ప్రధాని పర్యటన నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులు <<18008727>>సమ్మె<<>>ను తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈనెల 15న జరిగిన చర్చల్లో కొన్ని అంశాలపై చర్చలు కొలిక్కి వచ్చాయని JAC నేత కృష్ణయ్య తెలిపారు. దీంతో మిగిలిన అంశాలపై ఇవాళ చర్చించి సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు మధ్యాహ్నం 3 గం.కు విజయవాడలో చర్చలు ప్రారంభం కానున్నాయి.