News July 1, 2024
నేటి నుంచి కొత్త రూల్స్

SBI, ICICI క్రెడిట్ కార్డులకు చెందిన కొత్త రూల్స్ నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. SBI కార్డు ద్వారా జరిపే ప్రభుత్వ సంబంధిత లావాదేవీలకు ఇకపై రివార్డ్ పాయింట్స్ రావు. క్రెడిట్ కార్డు రీప్లేస్మెంట్ ఛార్జీలను ICICI రూ.100 నుంచి రూ.200కు పెంచింది. అయితే చెక్/క్యాష్ పికప్, ఛార్జ్ స్లిప్ రిక్వెస్ట్, ఔట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్, డూప్లికేట్ స్టేట్మెంట్ రిక్వెస్ట్కు ఛార్జీలను తొలగించింది.
Similar News
News April 10, 2026
బయటపడిన పాక్ కపట బుద్ధి.. లక్ష్యమిదే?

పాక్ నమ్మదగిన మధ్యవర్తి కాదని ఇజ్రాయెల్ చేసిన <<19605543>>ప్రకటన<<>> ఒక్కరోజులోనే నిజమైంది. దాయాది కపట బుద్ధి బయటపడింది. ఇన్నాళ్లూ ఇరాన్పై జరిగిన దాడులను ప్రశ్నించే ధైర్యం చేయలేదు. ఇప్పుడు కాళ్లావేళ్లా పడి ‘మీడియేటర్’ హోదా తెచ్చుకోగానే అగ్రరాజ్యం, భారత్కు మిత్రదేశమైన ఇజ్రాయెల్పై పాక్ మంత్రి ఖవాజా <<19612683>>విషం కక్కారు<<>>. తద్వారా ఆ దేశాన్ని విలన్ను చేసి అమెరికా పంచన చేరాలనేది పాక్ ఉద్దేశంగా కనిపిస్తోంది.
News April 10, 2026
BREAKING: పెరిగిన బంగారం, వెండి ధరలు

నిన్న భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,520 పెరిగి రూ.1,53,000కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,400 ఎగబాకి రూ.1,40,250 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు పెరిగి రూ.2,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో కాస్త తేడాలుండొచ్చు.
News April 10, 2026
ఒకట్రెండు రోజుల్లో ఇంటర్ ఫలితాలు?

TG: రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలను ఈ నెల 11-13 తేదీల్లో రిలీజ్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈసారి 9.97L మంది ఎగ్జామ్స్ రాయగా ఒక్క సబ్జెక్టులో ఫెయిలైన వారు దాదాపు లక్ష మంది ఉన్నట్లు సమాచారం. దీంతో పొరపాట్లకు తావు లేకుండా వారి ఆన్సర్ షీట్లను మరోసారి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ ఫలితాలను కావాలనే ఆలస్యం చేస్తున్నారంటూ SMలో జరుగుతున్న ప్రచారాన్ని నిన్న బోర్డు <<19609277>>ఖండించిన<<>> విషయం తెలిసిందే.


