News April 13, 2025
అంతర్జాతీయ క్రికెట్లో కొత్త రూల్స్!

అంతర్జాతీయ క్రికెట్లో కొత్త రూల్స్ అమలయ్యే అవకాశముంది. వన్డేల్లో పదేళ్ల నుంచి అమల్లో ఉన్న 2 కొత్త బంతుల విధానాన్ని మార్చాలని గంగూలీ సారథ్యంలోని క్రికెట్ కమిటీ ఐసీసీకి ప్రతిపాదించింది. ఒకప్పటిలా ఒకే బంతి వాడితే పాతబడ్డాక రివర్స్ స్వింగ్, స్పిన్కు అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. WTCలో భారీ తేడాతో గెలిస్తే, పెద్ద జట్లను చిన్నవి ఓడిస్తే అదనపు పాయింట్లు ఇవ్వాలంది. త్వరలో ICC తుది నిర్ణయం తీసుకోనుంది.
Similar News
News April 14, 2025
అంబేడ్కర్ ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ పాలన: KCR

TG: డా.బీ.ఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు మాజీ సీఎం KCR నివాళులు అర్పించారు. ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా BRS పాలన సాగిందని, దళితబంధు సహా అనేక పథకాలను అమలు చేశామని తెలిపారు. నేటి ప్రభుత్వం వాటిని కొనసాగించాలని, అప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
News April 14, 2025
రూ.13వేల కోట్ల మోసం.. మెహుల్ ఛోక్సీ అరెస్టు

వజ్రాల వ్యాపారి, పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB)ను మోసగించిన కేసులో ప్రధాన నిందితుడైన మెహుల్ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేశారు. భారత ఏజెన్సీలైన CBI, ED విజ్ఞప్తి మేరకు అతడిని అరెస్టు చేశారు. ఛోక్సీపై గతంలో ముంబైలో నాన్-బెయిలబుల్ వారెంట్లు నమోదయ్యాయి. PNBని రూ.13వేల కోట్లకు పైగా మోసం చేశారని 2018లో ఆరోపణలు రాగా ఛోక్సీ, నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయారు. అతడి మేనల్లుడు నీరవ్ లండన్ జైలులో ఉన్నారు.
News April 14, 2025
మే నాటికి GPOల నియామకం: మంత్రి పొంగులేటి

TG: రాష్ట్రంలోని 10,956 గ్రామాల్లో మే నాటికి గ్రామ పాలనాధికారుల సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రెవెన్యూ శాఖలో ప్రస్తుతం 480 మంది సర్వేయర్లు ఉన్నారని, వారి సంఖ్యను 1000కి పెంచుతామని తెలిపారు. ‘భూ భారతి’ చట్టాన్ని జూన్ 2లోగా పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొస్తామన్నారు. ధరణి ముసుగులో జరిగిన భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.