News July 20, 2024

తెలంగాణలో కొత్త పథకం.. వారికి రూ.1,00,000

image

TG: యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన తెలంగాణ అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. సచివాలయంలో కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన పేద అభ్యర్థులకు సర్కారు రూ.లక్ష ఆర్థిక సాయం ఇవ్వనుంది.

Similar News

News November 28, 2025

పాడేరు: సచివాలయాల పర్యవేక్షణకు డిప్యూటీ ఎంపీడీవోల నియామకం

image

జిల్లాలో గ్రామ సచివాలయాల పర్యవేక్షణకు డిప్యూటీ ఎంపీడీవోలను నియమిస్తూ కలెక్టర్ దినేష్ కుమార్ గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. జిల్లాలో 22మండలాలకు 22మంది అధికారులను నియమించారు. వీరు డిశంబర్ 1నుంచి నుంచి విధుల్లోకి రానున్నారు. సచివాలయాలను పర్యవేక్షణ చేయనున్నారు. పాడేరు మండలానికి రామకృష్ణ, అరకు ప్రసాద్, చింతపల్లి మూర్తి, రంపచోడవరం గిరిబాబు, కొయ్యూరు మండలానికి శ్రీనివాసరావు తదితరులు నియమితులయ్యారు.

News November 28, 2025

పిల్లలకు రాగిజావ ఎప్పుడివ్వాలంటే?

image

పసిపిల్లల్లో జీర్ణవ్యవస్థ రోజురోజుకూ వృద్ధి చెందుతుంటుంది. అందుకే తేలిగ్గా జీర్ణమయ్యే రాగిజావను 6-8 నెలల మధ్యలో అలవాటు చేయొచ్చంటున్నారు నిపుణులు. ఈ సమయానికల్లా పిల్లల్లో చాలావరకూ తల నిలబెట్టడం, సపోర్టుతో కూర్చోవడం లాంటి మోటార్‌ స్కిల్స్‌ డెవలప్‌ అయి ఉంటాయి కాబట్టి వాళ్లు ఆ రుచినీ, టెక్‌స్చర్‌నీ గ్రహిస్తారు. మొదట తక్కువ పరిమాణంతో మొదలుపెట్టి, అలవాటయ్యే కొద్దీ పరిమాణం పెంచుకుంటూ వెళ్లొచ్చు.

News November 28, 2025

మన ఆత్మలోనే వేంకటేశ్వరుడు

image

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః|
అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవ చ||
విష్ణుమూర్తి ఆత్మ స్వరూపుడు. ముక్తి పొందిన జీవులకు శాశ్వత గమ్యం ఆయనే. ఆ దేవుడు ప్రతి శరీరంలో ఉంటాడు. లోపల జరిగే ప్రతి విషయాన్ని సాక్షిగా చూస్తుంటాడు. కానీ, మనం ఎక్కడెక్కడో వెతుకుతుంటాం. ఆ దేవుడు బయటెక్కడో లేడు, మన అంతరాత్మలోనే ఉన్నాడని ఈ శ్లోకం వివరిస్తోంది. ఆయనే మోక్షాన్ని ఇస్తాడని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>