News March 9, 2025

రాష్ట్రంలో కొత్త స్కీం.. మొదలైన సర్వే

image

APలో P-4 పేరుతో కొత్త <<15600961>>పథకాన్ని <<>>ఉగాది నుంచి ప్రభుత్వం అమలు చేయనుంది. 16 జిల్లాల్లో నిన్నటి నుంచి సర్వే మొదలైంది. మొత్తం పేదల్లో అట్టడుగున ఉండే 20% పేదలను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే చేస్తోంది. 27 ప్రశ్నలు అడిగి వివరాలు సేకరిస్తోంది. ఇంటి యజమాని ఆధార్, ఫోన్ నంబర్, టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఏసీ, ల్యాప్‌టాప్, కంప్యూటర్ ఉందా? కరెంట్ బిల్లు ఎంత కడుతున్నారు? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు.

Similar News

News March 9, 2025

మూడో సంతానంగా ఆడపిల్ల పుడితే రూ.50,000: టీడీపీ ఎంపీ

image

AP: మూడో బిడ్డకు జన్మనిచ్చే మహిళలకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆఫర్ ప్రకటించారు. మూడో సంతానంగా ఆడపిల్లకు జన్మనిస్తే రూ.50,000, మగబిడ్డకు జన్మనిస్తే ఆవును బహుమానంగా ఇస్తానని ఓ కార్యక్రమంలో తెలిపారు. ఎక్కువ పిల్లల్ని కనాలని ప్రజలకు సీఎం చంద్రబాబు సూచిస్తున్న నేపథ్యంలో తాను ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై మీ కామెంట్?

News March 9, 2025

BRS ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్

image

TG: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును కేసీఆర్ ప్రకటించారు. BRS తరఫున రేపు శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. అటు కాంగ్రెస్ విజయశాంతి, శంకర్ నాయక్, అద్దంకి దయాకర్ పేర్లను ప్రకటించింది.

News March 9, 2025

అమ్మాయితో మ్యాచ్‌కు చాహల్

image

ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ నుంచి స్పిన్నర్ చాహల్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకులకు చాలాకాలం క్రితమే వారిద్దరూ దూరమయ్యారు. ఈక్రమంలో చాహల్ ఆర్జే మహ్వాష్ అనే మరో యువతికి దగ్గరైనట్లు చర్చ నడుస్తోంది. దుబాయ్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ఆయన ఆమెతో కలిసి రావడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. ఇదే నిజమైతే మీ కొత్త జీవితానికి ఆల్ ది బెస్ట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

error: Content is protected !!