News January 25, 2025

రేపటి నుంచి కొత్త స్కీమ్స్.. సీఎం కీలక ఆదేశాలు

image

TG: రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా పథకాలను రేపు ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. HYD మినహా అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేయాలన్నారు. ఫిబ్రవరి తొలి వారం నుంచి మార్చి 31లోగా పథకాల అమలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగొద్దని, అనర్హులకు లబ్ధి చేకూరిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News November 14, 2025

జూబ్లీహిల్స్ కౌంటింగ్: షేక్‌పేట డివిజన్‌లో కాంగ్రెస్ లీడింగ్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో EVM ఓట్లను లెక్కిస్తున్నారు. తొలి రౌండ్‌లో కాంగ్రెస్ 47 ఓట్ల ఆధిక్యంలో ఉంది. షేక్‌పేట డివిజన్‌లో ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడింగ్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌కు 8,911, BRSకు 8,864 ఓట్లు పోలయ్యాయి. అటు పోస్టల్ బ్యాలెట్‌లోనూ కాంగ్రెస్‌కు ఆధిక్యం వచ్చింది. ఇక్కడ ముస్లిం ఓట్లు అధికంగా ఉండగా.. 11న పోలింగ్ రోజు సాయంత్రం BRS-కాంగ్రెస్ ఇక్కడ దొంగ ఓట్లపై ఆరోపణలు చేసుకున్నాయి.

News November 14, 2025

బిహార్‌లో 2 చోట్ల MIM ఆధిక్యం

image

దేశమంతా ఆసక్తిగా చూస్తున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఎర్లీ ట్రెండ్స్ BJPకి అనుకూలంగా ఉన్నాయి. NDA 66 స్థానాల్లో లీడింగ్‌లో ఉండగా ఇందులో BJPవి 40, JDU 24 స్థానాలు. ఇక MGB 44 చోట్ల లీడ్ ప్రదర్శిస్తుండగా వీటిలో RJD-35, కాంగ్రెస్-7 ఉన్నాయి. ఇక ఏ కూటమిలో లేని AIMIM 2 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఆమౌర్‌లో 2020లో గెలిచిన ఆ పార్టీ అభ్యర్థి అక్తారుల్ ఇమాన్ ఈసారీ లీడ్‌లో ఉన్నారు.

News November 14, 2025

బిహార్ కౌంటింగ్ అప్‌డేట్

image

✦ NDA 49, MGB 39 స్థానాల్లో లీడింగ్
✦ రాఘోపూర్‌లో తేజస్వీ యాదవ్ లీడ్
✦ అలీనగర్‌లో మైథిలీ ఠాకూర్ (BJP) ముందంజ
✦ తారాపూర్‌లో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి లీడ్
✦ మహువా నుంచి లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ ఆధిక్యం
✦ మోకామాలో అనంత్ సింగ్ (JDU) ముందంజ