News January 25, 2025
రేపటి నుంచి కొత్త స్కీమ్స్.. సీఎం కీలక ఆదేశాలు

TG: రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా పథకాలను రేపు ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. HYD మినహా అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేయాలన్నారు. ఫిబ్రవరి తొలి వారం నుంచి మార్చి 31లోగా పథకాల అమలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగొద్దని, అనర్హులకు లబ్ధి చేకూరిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News December 15, 2025
రేపు మచిలీపట్నంకు నారా లోకేశ్, పీవీఎన్ మాధవ్ రాక

మంత్రి లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ మంగళవారం మచిలీపట్నం రానున్నారు. స్థానిక న్యూ హౌసింగ్ బోర్డ్ రింగ్లో ఉమ్మడిగా ఏర్పాటు చేస్తున్న మాజీ ప్రధాని వాజ్ పేయి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కాంస్య విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో ఇరువురు నేతలు పాల్గొననున్నట్లు ఆయా పార్టీ వర్గాలు తెలిపాయి. ఇరువురి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
News December 15, 2025
మెస్సీతో హ్యాండ్షేక్ కోసం రూ.కోటి!

‘గోట్ టూర్’లో భాగంగా అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. చాణక్యపురిలోని ప్రఖ్యాత లీలా ప్యాలెస్లో బస చేయనున్నారు. అక్కడ ఎంపిక చేసిన VIPలు, అతిథులకు మెస్సీతో క్లోజ్డ్ డోర్ ‘మీట్ అండ్ గ్రీట్’ ఏర్పాటు చేశారు. ఇందులో మెస్సీని కలిసి మాట్లాడేందుకు కొందరు కార్పొరేట్లు ₹కోట్లు కుమ్మరిస్తున్నట్లు సమాచారం. షేక్ హ్యాండ్ కోసమే ₹కోటి చెల్లించుకుంటున్నట్లు జాతీయ మీడియా చెబుతోంది.
News December 15, 2025
కలెక్షన్ల సునామీ.. రెండో వీకెండ్లో రూ.146కోట్లు

రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన రెండో వీకెండ్(శుక్ర, శని, ఆదివారం)లో అత్యధిక కలెక్షన్లు(రూ.146.60 కోట్లు) సాధించిన హిందీ చిత్రంగా హిస్టరీ క్రియేట్ చేసినట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు హిందీలో పుష్ప-2, ఛావా సినిమాలు మాత్రమే సెకండ్ వీకెండ్లో ₹100కోట్లు సాధించినట్లు తెలిపాయి. ఓవరాల్గా ధురంధర్ ₹553Cr సాధించినట్లు మూవీ టీమ్ ప్రకటించింది.


