News January 6, 2025

రాష్ట్రంలో స్వల్పంగా పెరిగిన కొత్త ఓటర్లు

image

AP: రాష్ట్రంలో నూతనంగా సవరించిన ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో 4,14,40,447 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 2,02,88,543 మంది, మహిళా ఓటర్లు 2,10,81,814 మంది ఉన్నారు. 3,400 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. అలాగే పోలింగ్ కేంద్రాల సంఖ్యను 46397కు పెంచింది. గత ఎన్నికల ముందు రాష్ట్ర ఓటర్ల సంఖ్య 4,08,07,256గా ఉండేది.

Similar News

News December 6, 2025

రబీ వరి నారుమడిలో సస్యరక్షణ ఎలా?

image

వరి నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను చల్లడం వల్ల నాటిన 20-25 రోజుల వరకు కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత వంటివి ఆశించకుండా నివారించవచ్చు. చలి వాతావరణం వల్ల అగ్గితెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉన్నందున అగ్గి తెగులు కట్టడికి లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రోథయోలిన్ 1.5ml కలిపి పిచికారీ చేసుకోవాలి.

News December 6, 2025

ఈ నెల 25న ‘అఖండ-2’ విడుదల!

image

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 25న రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ మూవీ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.

News December 6, 2025

ఖలీ భూమిపై దుండగుల కన్ను.. ఏం చేశాడంటే?

image

ఒంటిచేత్తో నలుగురిని ఎత్తిపడేసే బలం ఉన్న WWE స్టార్ రెజ్లర్ ది గ్రేట్ ఖలీ (దలీప్ సింగ్ రాణా) నిస్సహాయత వ్యక్తం చేశారు. హిమాచల్‌లోని పాంటా సాహిబ్‌లో కొందరు దుండగులు తన భూమిపైనే కన్నేశారని వాపోయారు. రెవెన్యూ అధికారుల అండతో వారు భూమిని ఆక్రమించడానికి యత్నించినట్లు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. ఇంతటి బడా సెలబ్రిటీకే ఈ దుస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.