News December 30, 2025
NEW YEAR: అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో

న్యూ ఇయర్ వేళ నగరవాసులకు మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణంగా రాత్రి 11 గంటల వరకు చివరి రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. రేపు 31ST నైట్ ఈవెంట్ల నేపథ్యంలో అర్ధరాత్రి కూడా మెట్రో రైల్ సేవలు అందించనుంది. జనవరి 1న అర్ధరాత్రి ఒంటి గంటకు చివరి రైలు ఉంటుంది. ఈ న్యూ ఇయర్కి జర్నీ స్ట్రెస్ లేకుండా సెలబ్రేషన్ చేసుకోవాలని మెట్రో అధికారులు సూచించారు.
SHARE IT
Similar News
News December 31, 2025
NZB: నూతన కలెక్టర్ ఇలా త్రిపాఠి నేపథ్యమీదే!

నిజామాబాద్ నూతన కలెక్టర్గా నియమితులైన ఇలా త్రిపాఠి UP లక్నోకు చెందిన వారు. ఢిల్లీలోని జేపీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 2013లో బీటెక్ పూర్తి చేశారు. ఆ తరువాత లండన్ వెళ్లారు. అక్కడ లండన్ స్కూల్ ఎకనామిక్స్లో చదివారు. రెండో అటెంప్ట్ 2017లో సివిల్స్ సాధించారు. ఆమె భర్త భవేశ్ మిశ్రా కూడా IAS అధికారి. ఆమె ములుగులో పని చేసి టూరిజం డైరెక్టర్గా వెళ్లారు. తదుపరి నల్గొండ కలెక్టర్గా పని చేశారు.
News December 31, 2025
Khaleda Zia: ఇండియాలో పుట్టి.. ఇండియా వ్యతిరేకిగా మారి..

బంగ్లాదేశ్ Ex PM <<18709090>>ఖలీదా జియా<<>>(80) నిన్న మరణించిన విషయం తెలిసిందే. బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్లో పుట్టిన ఆమె భారత వ్యతిరేకిగా ముద్రపడ్డారు. PMగా పదేళ్లలో గంగా జలాలు, వలసదారులు వంటి ఎన్నో అంశాల్లో మనతో ఘర్షణలకు దిగారు. భారత వ్యతిరేక శక్తులకు బంగ్లాలో ఆశ్రయమిచ్చారు. పాక్, చైనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో నాడు రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతలు ఉండేవి. హసీనా హయాంలో పరిస్థితి మారింది.
News December 31, 2025
విజయవాడ పోలీస్ కమిషనరేట్ ‘ఫ్యూచర్ విజన్-2026’

విజయవాడ పోలీస్ కమిషనరేట్ నగర భద్రతను మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు ‘ఫ్యూచర్ విజన్-2026’ను ప్రకటించింది. స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్విజిబుల్ పోలీసింగ్, ప్రిడిక్టివ్ ప్రొటెక్షన్ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఏఐ ఆధారిత ట్రాఫిక్ నియంత్రణ, ముందస్తు నేర నివారణ, డ్రోన్ నిఘా, ప్రవర్తనా విశ్లేషణలతో ప్రజలకు కనిపించకుండా భద్రత కల్పించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు.


