News December 31, 2024
న్యూఇయర్ వేడుక.. పోలీసుల ప్రత్యేక ఆహ్వానం
లా అండ్ ఆర్డర్ను బ్రేక్ చేస్తూ న్యూఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునే వారిని ఉద్దేశించి పంజాబ్ పోలీసులు షేర్ చేసిన పోస్టర్ వైరలవుతోంది. ‘డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, రోడ్లపై తన్నుకోవడం, LAWను బ్రేక్ చేసిన వారికి స్పెషల్ ఆఫర్. సిటీ పోలీస్ స్టేషన్కు ఫ్రీ ఎంట్రీ. వారందరికీ స్పెషల్ ట్రీట్మెంట్ లభిస్తుంది. అలాంటివారెవరైనా కనిపిస్తే 112కి కాల్ చేసి మమ్మల్ని ఆహ్వానించండి’ అని రాసున్న పోస్టర్ షేర్ చేశారు.
Similar News
News February 5, 2025
దేశంలో నాన్వెజ్ బ్యాన్ చేయాలి: శత్రుఘ్న సిన్హా
దేశంలో మాంసాహారంపై నిషేధం విధించాలని సినీనటుడు, టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా అభిప్రాయపడ్డారు. మన దేశంలో చాలా చోట్ల బీఫ్ బ్యాన్ చేశారని, అలానే నాన్వెజ్ను కూడా బ్యాన్ చేయాలన్నారు. నార్త్ఈస్ట్తోపాటు దేశంలో ఇంకా చాలా ప్రాంతాల్లో గొడ్డు మాంసం విక్రయాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఉత్తరాఖండ్ తీసుకొచ్చిన యూసీసీ (యూనిఫామ్ సివిల్ కోడ్) చట్టాన్ని ఆయన ప్రశంసించారు.
News February 5, 2025
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒప్పుకోని ‘AAP’
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కొద్దిసేపటి క్రితం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఆప్ నేత సుశీల్ గుప్తా ఒప్పుకోలేదు. ‘ఇవి మాకు నాలుగో ఎన్నికలు. ప్రతిసారి ఎగ్జిట్ పోల్స్ ఆప్కు అధికారం వస్తుందని అంచనా వేయలేదు. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల కోసం పని చేశారు. ఫలితాలు మాకే అనుకూలంగా వస్తాయి. కచ్చితంగా మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం’ అని చెప్పారు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా అంచనా వేశాయి.
News February 5, 2025
కారు యజమానులకు GOOD NEWS!
నేషనల్ హైవేలపై తరచూ ప్రయాణం చేసే ప్రైవేట్ కారు యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. వీరి కోసం ఏడాదికి రూ.3000, 15 ఏళ్లకు రూ.30000తో పాసులు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలి. వీటితో దేశంలోని ఏ జాతీయ రహదారిపైనైనా ఎన్నిసార్లైనా తిరగొచ్చు. ప్రస్తుతం నెలకు రూ.340 పాసుతో ఒక టోల్ ప్లాజాలోనే వెళ్లాలనే రూల్ ఉంది. కొత్త విధానం ప్రకారం నెలకు రూ.250 చెల్లిస్తే చాలు.