News March 18, 2025

మోదీతో జోక్ చేసిన న్యూజిలాండ్ ప్రధాని

image

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్, మోదీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇటీవల భారత్ CTకప్ గెలవటం మోదీ ప్రస్తావించలేదు. నేను కూడా భారత్ పై న్యూజిలాండ్ టెస్ట్ విజయాల టాపిక్ తీయలేదు. ఈ రెండు విషయాలను పక్కన పెడదామని క్రిస్టఫర్ చమత్కరించారు. దీంతో ప్రధాని మోదీ తోపాటు క్రికెటర్ రాస్ టేలర్ తదితరులు నవ్వులు చిందించారు.

Similar News

News March 18, 2025

7 సెకన్లలోనే గుండె జబ్బుల నిర్ధారణ.. NRIకి సీఎం ప్రశంసలు

image

AP: గుండె జబ్బులను నిర్ధారించే సిర్కాడియావీ యాప్‌ను రూపొందించిన NRI విద్యార్థి సిద్ధార్థ్(14) CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్‌ను కలిశారు. యాప్ గురించి అడిగి తెలుసుకున్న సీఎం విద్యార్థిని ప్రశంసించారు. వైద్యరంగంలో మరిన్ని ఆవిష్కరణలు చేయాలని ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ యాప్‌ను సిద్ధార్థ్ ఏఐ సాయంతో రూపొందించారు. దీంతో ఇప్పటికే గుంటూరు ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించారు.

News March 18, 2025

రేపు భూమిపై అడుగుపెట్టనున్న సునీతా విలియమ్స్

image

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ రేపు భూమి మీదకు రానున్నారు. మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్‌తో కలిసి ఉదయం 3.27నిమిషాలకు భూమిపైకి చేరుకుంటారని నాసా ప్రకటించింది. వీరు ప్రయాణించే వ్యోమనౌక ఫ్లోరిడా తీరానికి చేరువలో గల సాగర జలాల్లో దిగుతుందని వివరించింది. భారత కాలమానం ప్రకారం ఈ రోజు ఉ. 8:15 గంటలకు వీరి యాత్ర ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

News March 18, 2025

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. స్వామి వారి దర్శనానికి 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 70,824 మంది భక్తులు దర్శించుకోగా 25,674 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు సమకూరింది.

error: Content is protected !!