News February 3, 2025

రోహిత్‌తో విభేదాల వార్తలు.. క్లారిటీ ఇచ్చిన గంభీర్

image

BGT సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మకు, కోచ్ గంభీర్‌కు మధ్య మనస్పర్థలొచ్చాయంటూ వార్తలు వెల్లువెత్తాయి. ఆ వార్తలపై తాజాగా గంభీర్ స్పష్టతనిచ్చారు. ‘జట్టు ప్రదర్శన సరిగ్గా లేనప్పుడు చాలా వార్తలు గుప్పుమంటుంటాయి. పుకార్లు షికారు చేస్తుంటాయి. మ్యాచులు గెలుస్తుంటే అవే సమసిపోతాయి. జట్టులోని ఆటగాళ్లందరూ ఎన్నో మ్యాచులు ఆడారు. పరిణతి కలిగినవారు. విభేదాలేం లేవు. అందరూ కలిసే ఉన్నారు’ అని పేర్కొన్నారు.

Similar News

News December 26, 2025

సంక్రాంతి సెలవులకు ముందు FA-3 పరీక్షలు

image

AP: ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లలో సంక్రాంతి సెలవులకు ముందు ఫార్మెటివ్ అసెస్మెంటు-3 ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. JAN 5 నుంచి 8వరకు 1-5 తరగతులకు ఉ.9.30-10.45 గంటల మధ్య, మ.1.15-2.30 గంటల మధ్య పరీక్షలుంటాయి. 6-10 తరగతుల వారికీ ఉదయం, మధ్యాహ్నం రెండేసి సెషన్లు టెస్ట్ నిర్వహిస్తారు. సిలబస్, మోడల్ పేపర్లతో SCERT సర్క్యులర్ జారీచేసింది. 8న పరీక్షలు ముగియనుండగా 10నుంచి సంక్రాంతి సెలవులు మొదలవుతాయి.

News December 26, 2025

ఆదోనికి కిమ్స్ టెండర్ వేయలేదా?

image

AP: PPP విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు ప్రభుత్వం తొలి విడత టెండర్లు పిలవగా 4 కాలేజీల్లో ఆదోనికి కిమ్స్ బిడ్ దాఖలు చేసిందని వార్తలొచ్చాయి. అయితే తాము అసలు టెండర్‌లో పాల్గొనలేదని కిమ్స్ యాజమాన్యం పేర్కొన్నట్లు సమాచారం. తాము టెండర్ వేసినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, అసలు ఆ ప్రక్రియలో పాల్గొనాలని తాము అనుకోలేదని చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

News December 26, 2025

గొంతులు కోస్తున్న చైనా మాంజా.. జాగ్రత్త!

image

సంక్రాంతి సమీపిస్తుండటంతో ఆకాశంలో పతంగులు సందడి చేస్తున్నాయి. కానీ ఆ సరదా వెనుక ప్రమాదం కూడా పొంచి ఉంది. అదే చైనా మాంజా. దీనిపై నిషేధం ఉన్నా ఇప్పటికీ యథేచ్ఛగా విక్రయాలు జరుగుతున్నాయి. తాజాగా HYD శివారు కీసరలో చైనా మాంజా మెడకు తగిలి జశ్వంత్ అనే యువకుడికి తీవ్ర గాయమైంది. బైక్‌పై వెళ్తున్న అతడి మెడను మాంజా కోసేయడంతో ఏకంగా 19 కుట్లు పడ్డాయి. రోడ్లపై ప్రయాణించేటప్పుడు మీరూ జాగ్రత్త వహించండి.