News November 22, 2024

రెహమాన్‌, మోహిని డేపై వార్తలు అవాస్తవం: లాయర్

image

AR రెహమాన్ దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే ఆయన వద్ద పని చేసే మోహిని డే తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఉందా అంటూ ప్రచారం నడిచింది. ఆ వార్తల్ని రెహమాన్ భార్య తరఫు లాయర్‌ వందన షా ఖండించారు. ‘ఒకే సమయానికి వేర్వేరు వ్యక్తులు విడిపోతుంటే? రెండింటికీ లంకె పెట్టేస్తారా? ఇలాంటి చెత్త రాతల్ని నేనెప్పుడూ చదవలేదు. అవి అవాస్తవం’ అని తేల్చిచెప్పారు.

Similar News

News February 4, 2026

దేశీ మిర్చికి రికార్డు ధర.. క్వింటా రూ.41,200

image

TG: వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో దేశీ మిర్చి రికార్డు ధర పలికింది. క్వింటా మిర్చి రూ.41,200కు అమ్ముడుపోయింది. గత మూడేళ్లలో దేశీ మిర్చికి ఇదే రికార్డు ధర అని మార్కెట్ అధికారులు వెల్లడించారు. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన దస్తగిరి అనే రైతు తీసుకొచ్చిన 6 క్వింటాళ్ల దేశీ మిర్చిని వ్యాపారులు ఈ ధరకు కొనుగోలు చేశారు.

News February 4, 2026

గడాఫీ కుమారుడి హత్య

image

లిబియా నియంత గడాఫీ కుమారుడు సైఫ్ అల్ ఇస్లాం గడాఫీ(53)ని దుండగులు హత్య చేశారు. జింటాన్‌లోని ఇంటిపై నలుగురు సాయుధులు దాడి చేసి హతమార్చినట్లు ఆయన అడ్వైజర్ అబ్దుల్లా వెల్లడించారు. తన తండ్రి హయాంలో ఇస్లాం ఎలాంటి పదవి చేపట్టకపోయినా మితవాది, సంస్కర్త అనే ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. 2011 తిరుగుబాటులో గడాఫీ హతమైన తర్వాత 2021లో ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.

News February 4, 2026

వరిలో ఈ తెగుళ్లు కనిపిస్తున్నాయా? నివారణ ఎలా?

image

తెలుగు రాష్ట్రాల్లో వరి పంట వివిధ దశల్లో ఉంది. ప్రస్తుతం చలి, వాతావరణ పరిస్థితుల వల్ల పంటలో పురుగులు, చీడపీడల ఉద్ధృతి ఎక్కువైంది. ప్రధానంగా వరిలో మానిపండు తెగులు, పాముపొడ(మాగుడు) తెగులు, రెల్లరాల్చు పురుగు, కాండం కుళ్లు/దుబ్బు కుళ్లు కనిపిస్తున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే పంట ఎదుగుదల తగ్గి, దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ తెగుళ్ల కట్టడికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.